రిషికేశ్వరి సూసైడ్: రాత్రుల్లో రూం నుంచి వెళ్లగొట్టారు!
గుంటూరు: జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న రిషికేశ్వరి ఘటన పైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన కమిటీ.. ప్రిన్సిపల్ బాబురావు వ్యవహార శైలిని తప్పుపట్టింది.
అయితే, ఇప్పటి వరకు ఆయన పైన ఇంకా చర్యలు తీసుకోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. బాబురావు పైన విచారణ జరపాలని ప్రభుత్వానికి సూచించింది. బాబురావు వల్లే విశ్వవిద్యాలయంలో సంస్కృతి చెడిపోయిందని, ర్యాగింగ్ వంటి అనేక సంఘటనలకు అతనే కారణమని తేల్చింది.
బాబురావు విషయమై కమిటీ పలు విషయాలు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో చెప్పింది. విశ్వవిద్యాలయంలో ఇలాంటి సంఘటనకు ప్రిన్సిపల్ కారణమని, ర్యాగింగ్కు అనుకూలంగా విద్యార్థులను ప్రోత్సహించారని కమిటీ నివేదికలో పేర్కొంది.

బాబురావు తమతో చనువుగా ఉండటం వల్లే సీనియర్ విద్యార్థులు జూనియర్ల పైన చెలరేగిపోయారని, దుస్తులు లేకుండా తమ ముందు డ్యాన్స్ చేయాలని జూనియర్లను వేధించేవారని కూడా కమిటీ తేల్చింది. జూనియర్ల ఫోన్ నెంబర్లు సీనియర్ అమ్మాయిలు సీనియర్ విద్యార్థులకు ఇచ్చేవారు.
వారితో మాట్లాడాలని వేధించేవారు. రిషికేశ్వరితో పాటు ఆమె సహచర జూనియర్ విద్యార్థినులను సీనియర్ విద్యార్థినులు గదులు ఖాళీ చేయాలని బయటకు గెంటేసి రాత్రి వేళ్ల్లో ఆరుబయట నిల్చోబెట్టేవారని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ మద్యం తాగి విద్యార్థులతో కలిసి చిందేశాడు.
రిషికేశ్వరి ఆత్మహత్యపై ఫిర్యాదు చేయకుండా.. ప్రిన్సిపల్గా బాబురావు దానిని విస్మరించాడని.య ర్యాగింగ్ నిరోధక చట్టం పరిధిలో కేసును విచారించాలని తేల్చింది. వాటితో పాటు క్రిమినల్ లా, మహిళా వేధింపుల చట్టాల కింద కూడా విచారణ చేపట్టాలని సూచించింది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications