రాక్షసత్వానికి చెక్: కెమికల్తో నపుంసకత్వం
అందులో అత్యాచార నిందితులకు ముప్పై ఏళ్ల వరకు జైలు శిక్ష విధించాలని, అత్యంత అరుదైన కేసుల్లో దోషులకు రసాయన ప్రక్రియ ద్వారా వారిలో లైంగిక కాంక్షను, విపరీతమైన లైంగిక ప్రవృత్తిని సమూలంగా నాశనం చేయాలని గట్టిగా కోరింది. రసాయనిక సూది మందుతో వంధ్యత్వం కలుగక పోయినప్పటికీ దీని ప్రభావం వల్ల లైంగికపరమైన కోరికలు ఉత్పన్నమయ్యే ప్రసక్తే ఉండదు. తద్వారా వారిని నపుంసకులుగా చేయాలని సూచించింది.
మూడు నెలల్లో తేల్చేలా ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని, బాల నేరస్తుల వయోపరిమితి 18 నుంచి 15 ఏళ్లకు తగ్గించాలని సూచించింది. దీనిని ముందు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ జెఎస్ వర్మ కమిటీకి సమర్పించాలని నిర్ణయించుకుంది. ఆ తర్వాత ఆర్డినెన్స్ జారీ చేయనుంది. బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టే అవకాశముంది. ఈ ముసాయిదా చర్చల్లో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు.
బాల నేరస్తుల చట్టాన్ని సవరించాలని, బాల నేరస్తుల వయసు పరిమితిని మరింత తగ్గించాలని సూచించింది. వయో పరిమితిని తగ్గించాలని ముసాయిదాలో ఉంది. ఢిల్లీ గ్యాంగ్ రేప్ నిందితుల్లో అత్యంత క్రూరత్వానికి ఒడిగట్టిన వారిలో ఒకడు 18 ఏళ్ల కంటే తక్కువ ఉన్నాడు. స్పృహ తప్పిన తర్వాత కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. దీనిని దృష్టిలో ఉంచుకునే బాల నేరస్తులుగా పరిగణించే వయసును 15 ఏళ్లకు కుదించాలని కొంత మంది ప్రతిపాదించారు.
అయితే ఈ ప్రతిపాదనలకు న్యాయపరంగా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అన్న విషయాన్ని పరిశీలించిన తర్వాత దీనిపై ఆర్డినెన్స్ తీసుకు వస్తారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మరో రెండు నెలలు మాత్రమే ఉన్న నేపథ్యంలో, ఈలోపులోనే ఆర్డినెన్స్ తీసుకొచ్చి, బడ్జెట్ సమావేశాల్లో చట్టం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. రేప్ చేస్తే నపుంసకులుగా మార్చే విధానం ఇప్పటికే పలు దేశాల్లో అమల్లో ఉందట.