జగన్ కోసం సోదరి షర్మిళ, బావ అనిల్ పాట్లు?

ఇటీవల గోదావరి జిల్లాలోని అమలాపురంలో సువార్ సభలో అనిల్ తో పాటు ఆయన భార్య షర్మిళ కూడా పాల్లొన్నారట. అక్కడ అనిల్ మాట్లాడుతూ.. అద్వితీయమైన కుమారుడిని ఇచ్చారంటూ పరోక్షంగా వైయస్సార్, జగన్లను ఉద్దేశించి ప్రస్తావించారట. ఆ తర్వాత మాట్లాడిన షర్మిళ కూడా తన తండ్రి వైయస్సార్ను ప్రస్తావించారట. వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టాక ఆయనను ముఖ్యమంత్రిని చేసే ఉద్దేశ్యంలో భాగంగా ప్రతి దైవ సభలోనూ అనిల్ ఇలాంటి పొలిటికల్ ప్రస్తావన తీసుకు వస్తున్నారట. గతంలోనూ అనిల్ తన బావమరిది జగన్ కోసం చర్చిలలో ప్రార్థనలు చేశారనే వాదనలు వినిపించాయి. జగన్ కోసం అనిల్ ప్రార్థనలు చేశారనే అంశం అప్పుడు చర్చనీయాంశమైంది. సువార్త సభల్లో, చర్చిలలో ఇలాంటి రాజకీయ ప్రస్తావని తీసుకు రావడాన్ని పలువురు ఖండిస్తున్నారు.












Click it and Unblock the Notifications