టీఆర్ఎస్ భవన్కు అదే బలం: సుందరీకరణ పనుల్లో కేసీఆర్ ఇలా
ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖర్రావు మంగళవారం తెలంగాణ భవన్ను సందర్శించారు. అక్కడ జరుగుతున్న సుందరీకరణ పనులను పరిశీలించి, పలు సూచనలు చేశారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖర్రావు మంగళవారం తెలంగాణ భవన్ను సందర్శించారు. అక్కడ జరుగుతున్న సుందరీకరణ పనులను పరిశీలించి, పలు సూచనలు చేశారు. పనులన్నీ వాస్తు ప్రకారం జరగాలని సూచించారు.

సుందీకరణ పనుల పరిశీలన
తెలంగాణ భవన్లో వెయ్యి మందికి సరిపోయే ఏసీ హాల్, గ్రీన్ టాయ్లెట్లు, ఆర్వో ప్లాంట్లు, బలమైన సెక్యూరిటీ వ్యవస్థ, భవన్ చుట్టూ రోడ్డు, పెయింటింగ్, తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ అలంకరణలు, లైటింగ్, పార్కింగ్ పనులు ఇటీవలే పూర్తయ్యాయి. వీటిని పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ తెలంగాణభవన్కు వచ్చారు. ఏసీ హాల్ను, తన గదిని, మీడియా గదిని, కమ్యూనికేషన్ సెంటర్ను చూశారు.

ఇలా ట్రాఫిక్కు చెక్
తెలంగాణ భవన్ ముందున్న వర్షపు నీటికాలువ పక్కనున్న స్థలంలోనుంచి రోడ్డును మెయిన్రోడ్డుకు కలుపాలని, నీటికాలువ వెంట ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వరకు రోడ్డు వేయాలని కేసీఆర్ సూచించారు. భవన్ పక్కనున్న పోలీసుల భూమిని కలుపుతూ రోడ్ నంబర్ 12కు రోడ్డు వేయడంద్వారా ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుతాయని సీఎం సూచించారు.

వాస్తు ప్రకారమే..
కాగా, తెలంగాణ భవన్లో గార్డెన్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ గార్డెన్ కూడా వాస్తు ప్రకారమే ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తు కోసం కేసీఆరే స్వయంగా కొన్ని మొక్కలను ఈ గార్డెన్లో నాటించారు. తైవాన్కు చెందిన ‘లక్కీ ఫికస్', ఇటలీ నుంచి తెప్పించిన ఓలైవ్ ట్రీ, ఇతర ఆకర్షణీయమైన చెట్లు ఈ గార్డెన్లో ఉన్నాయి. వాస్తు ప్రకారమే ఈ మొక్కలను నాటించడం గమనార్హం.

రూ.2కోట్లతో మెరుగులు
ఆగస్టు 14, 2006లో తెలంగాణ భవన్ను తన మంచి స్నేహితుడైన పిట్టాలి మక్కల్ కచ్చి(పీఎంకే) నేత ఎస్ రామదాస్ తో కలిసి కేసీఆర్ ప్రారంభించారు. అప్పట్నుంచి ఎలాంటి సుందరీకరణ పనులు జరలేదు. దీంతో మరోసారి కేసీఆర్.. తెలంగాణపై దృష్టి సారించి మెరుగులు దిద్దుతున్నారు. 40వేల స్క్వేర్ ఫీట్ల భవనానికి రూ. 2కోట్లతో సుందరీకరణ పనులు చేపట్టారు.

నేతలకు సూచనలు
భవన్ ముందున్న వర్షపు నీటికాలువ మీద చిన్న బ్రిడ్జి కట్టాలని చెప్పారు. సుందరీకరణ వివరాలను మేయర్ బొంతు రామ్మోహన్ సీఎంకు వివరించారు. సీఎం వెంట వచ్చిన వారిలో మంత్రులు హరీశ్రావు, పద్మారావు, ఎమ్మెల్యేలు ప్రశాంత్రెడ్డి, జీవన్రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శ్రీనివాస్రెడ్డి, నమస్తే తెలంగాణ సీఎండీ దామోదర్రావు, టీన్యూస్ ఎండీ సంతోష్కుమార్, టీఎస్ఎండీసీ చైర్మన్ సుభాష్రెడ్డి, వాస్తుశాస్త్రవేత్త సుద్దాల సుధాకర్తేజ తదితరులున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications