కేఈ కృష్ణమూర్తికి మరోసారి అవమానం!
ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి మరోసారి అవమానం జరిగింది. సీనియర్ మంత్రి అయినప్పటికీ, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన జెండా ఎగురవేసే అవకాశం లేకుండా పోయింది.
అమరావతి: ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి మరోసారి అవమానం జరిగింది. సీనియర్ మంత్రి అయినప్పటికీ, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన జెండా ఎగురవేసే అవకాశం లేకుండా పోయింది.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లాల ఇంచార్జి మంత్రులు జెండా ఎగురవేయాలని ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ఏ జిల్లాకు ఇంచార్జి మంత్రిగా లేరు.

దీంతో అధికారికంగా జిల్లా కేంద్రంలో జాతీయ జెండా ఎగురవేసే అవకాశం లేదు. ప్రభుత్వ ఉత్తర్వుల కారణంగా కేఈ కృష్ణమూర్తి సొంత జిల్లా కర్నూలులో మంత్రి కాల్వ శ్రీనివాసులు జెండా ఎగురవేస్తారు.
మంత్రివర్గంలో సీనియర్ అయినప్పటికీ, ఆయనను ఏ జిల్లాకు ఇంచార్జిగా నియమించకపోవడం గమనార్హం. గతంలో డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీ అధికారాలను సాధారణ పరిపాలనా విభాగానికి బదిలీ చేయడం తెలిసిందే. రెవెన్యూ అంశాలకు సంబంధించి ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీలో కూడా ఆయనకు స్థానం కల్పించలేదు.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది












Click it and Unblock the Notifications