రాజుకు వైద్య పరీక్ష, ఇంటరాగేషన్
హైదరాబాద్: చంచల్గూడ జైలులో ఉన్న రామలింగరాజు సోదరులను, సిఎఫ్ వో వడ్లమాని శ్రీనివాస్లను సీఐడీ పోలీసులు ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో తమ కస్టడీలోకి తీసుకున్నారు. వీరిని విచారించడానికి నాంపల్లి కోర్టు నాలుగు రోజులపాటు అనుమతివ్వడంతో సీఐడీ పోలీసులు మాసబ్ట్యాంక్లోని తమ కార్యాలయానికి తరలించారు.
రామలింగరాజుకు వైద్య పరీక్షలు అక్కడే నిర్వహించారు. న్యాయవాది సమక్షంలో రామలింగరాజు సోదరులను సిఐడి పోలీసులు విచారిస్తున్నారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు పగలే, న్యాయవాది సమక్షంలోనే రాజు సోదరులను పోలీసులు ఇంటరాగేట్ చేయవలసి ఉంది.
Comments
Story first published: Thursday, February 5, 2009, 12:04 [IST]