రోజాకు తప్పిన ప్రమాదం
రాజమండ్రి: తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజాకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం నుంచి ఆమె తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో పలుకార్యక్రమాల్లో పాల్గొన్నారు. చివరిగా రాత్రి 9.20గంటల సమయంలో కోటనందూరులో కార్యక్రమాన్ని ముగించుకుని విశాఖనుంచి హైదరాబాద్కు వెళ్లే ప్రత్యేక రైలు అందుకునేందుకు అత్యంత వేగంతో తుని చేరిన ఆమె 2వ నెంబరు ఫ్లాట్ఫారం వద్దకు చేరుకున్నారు.
అప్పటికే రైలు స్టేషన్ సమీపంలోకి వచ్చేస్తోంది. ఇది చూసిన రోజా తదితరులు క్షణాల వ్యవధిలో ట్రాక్దాటి 1వ నెంబర్ ఫ్లాట్ఫారంపైకి చేరుకున్నారు. రోజా ట్రాక్దాటిన క్షణాల్లోనే అదే ట్రాక్పై నుంచి రైలు వచ్చింది. ట్రాక్దాటేటప్పుడు రోజాకు రైలుకు మధ్య కొన్ని అడుగుల దూరం మాత్రమే ఖాళీవుంది. అక్కడివారందరికీ ఒక్కటే టెన్షన్..త్రుటిలో ప్రమాదం తప్పిందని ఉపిరిపీల్చుకున్నారు.
Comments
Story first published: Wednesday, January 28, 2009, 13:46 [IST]