హైదరాబాద్:
ఈ
ఎన్నికల్లో
విజయం
తమదంటే
తమదని
ప్రతి
రాజకీయ
పార్టీ
చెబుతూ
సంబరాలు
చేసుకుంటున్నారని
అయితే
తుది
తీర్పు
వెలువడే
16వ
తేదీ
వరకు
వీరెవరి
జోస్యాలకు
విలువలేదని
సీపీఎం
ప్రధాన
కార్యదర్శి
రాఘవులు
అన్నారు.
హైదరాబాద్లో
సీపీఎం
కార్యవర్గ
సమావేశాల
సందర్భంగా
మీడియాతో
మాట్లాడుతూ
ఆయన
పై
వ్యాఖ్యలు
చేశారు.
సీపీఎం
అభిప్రాయం
ఏమిటని
ఆయనను
విలేకరులు
ప్రశ్నించగా
ఏ
పార్టీకి
ఏకపక్ష
ఫలితాలు
రావని
తాము
భావిస్తున్నామని,
ప్రభుత్వ
ఏర్పాటులో
తాము
కీలకపాత్ర
వహిస్తామని
అన్నారు.
తాడిపత్రి
ఘటనకు
బాధ్యులైనవారిపై
కఠిన
చర్యలు
తీసుకోవాలని
డిమాండ్
చేశారు.