వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై ఎపి పార్టీలు కూర్చోవాలి: మనీష్

By Pratap
|
Google Oneindia TeluguNews

Manish Tiwari
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పార్టీలన్నీ ఏకతాటి మీదికి వచ్చి తెలంగాణపై ఏకాభిప్రాయానికి రావాలని ఎఐసిసి అధికార ప్రతినిధి మనీష్ తివారీ అన్నారు. కాగా, తెలంగాణపై ఢిల్లీలో విరివిగా లాబీయింగ్ జరుగుతోంది. ఒక వైపు కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు సమైక్యాంధ్రకు అనుకూలంగా, మరో వైపు తెలంగాణ పార్లమెంటు సభ్యులు తెలంగాణకు అనుకూలంగా లాబీయింగ్ ను ముమ్మరం చేశారు. సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు బుధవారం ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిశారు. కావూరి సాంబశివరావు, వైయస్ జగన్ తదితరులు మన్మోహన్ ను కలిసి తమ వాదనను వినిపించారు. ఈ సాయంత్రంలోగా అధిష్టానం ఒక నిర్ణయాన్ని వెల్లడిస్తుందని కావూరి సాంబశివరావు చెప్పారు.

కాగా, తెలంగాణ పార్లమెంటు సభ్యులు బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ సాధ్యం కాదని వారు ప్రణబ్ ముఖర్జీతో చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై వెనక్కి తగ్గకూడదని వారు ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఇదిలావుంటే, తెలంగాణపై బుధవారం ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) భాగస్వామ్య పక్షాలు సమావేశం కానున్నాయి. తెలంగాణపై కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటనపై కొన్ని యుపిఎ భాగస్వామ్య పక్షాలు విభేదించాయి. రాష్ట్రానికి చెందిన లోకసత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ బుధవారం ప్రధానిని కలవనున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X