వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమైక్యవాదానికి చిరంజీవి జై

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం మధ్యాహ్నం ప్రకటన చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సామాజిక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా ఆయన ఎన్నికలకు ముందు నిర్ణయం తీసుకున్నారు. అయితే సమైక్యవాదంతో రాయలసీమ, కోస్తాంధ్రకు చెందిన పార్టీ శాసనసభ్యులు రాజీనామాలు చేయడంతో ఆయన పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు.

పార్టీ వైఖరిని మార్చుకునే విషయంపై చిరంజీవి పార్టీ నాయకులతో మంగళవారం అర్థరాత్రి వరకు చర్చలు జరిపారు. సమైక్యాంధ్ర నినాదంతోనే పోరాటంలో పాల్గొనాలని కూడా చిరంజీవి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే చిరంజీవి నిర్ణయాన్ని తెలంగాణ పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ కమిటీ ఏర్పాటుకు తెలంగాణ నేతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రజాభీష్టం మేరకే కోస్తాంధ్ర, రాయలసీమ శాసనసభ్యులు రాజీనామాలు చేశారని, వారి రాజీనామాలను వెనక్కి తీసుకోవాలని అడిగే హక్కు తనకు లేదని చిరంజీవి మంగళవారం అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X