వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమైక్యాంధ్రకు తిరుపతిలో చిరు దీక్ష

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి రేపు గురువారం తిరుపతిలో దీక్ష చేపడుతారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన తిరుపతి ప్రజారాజ్యం పార్టీ శాఖ నాయకులకు తెలిపినట్లు సమాచారం. తీవ్రమైన ఒత్తిడి రావడంతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. సమైక్యాంధ్రకు మద్దతు దీక్ష చేయాలని నిర్ణయించుకున్న కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కృతజ్ఞతలు తెలిపారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు చేసిన తన పార్టీ శాసనసభ్యులను చిరంజీవి ఇది వరకే సమర్థించారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే వారు రాజీనామా చేశారని ఆయన అన్నారు. రాజీనామాలను ఉపసంహరించుకోవాలని అడిగే హక్కు తనకు లేదని కూడా ఆయన అన్నారు. తిరుపతిలో చిరంజీవి దీక్షకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X