వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

21న ఢిల్లీకి సీమాంధ్ర ఎమ్మెల్యేలు

By Pratap
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy
హైదరాబాద్: సమైక్యాంధ్ర వాదనతో కాంగ్రెసుకు చెందిన ఆంధ్ర, రాయలసీమ శానససభ్యులు, ఎమ్మెల్సీల ప్రతినిధి బృందం ఈ నెల 21వ తేదీన ఢిల్లీ వెళ్లనుంది. సీనియర్ కాంగ్రెసు శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి నివాసంలో బుధవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు నిర్ణయం తీసుకున్నారు. వారు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మన్మోహన్ సింగ్, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర మంత్రులు చిదంబరం, ప్రణబ్ ముఖర్జీలను కలుస్తామని జెసి దివాకర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు.

తాము కలవడానికి అవసరమైన అపాయింట్ మెంట్లు తీసుకోవాలని తాము కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యులు కోరారు. తమతో కలిసి వచ్చే రాజకీయ పార్టీలను కలుపుకుని పోతామని జెసి చెప్పారు. నిన్న వచ్చిన ప్రకటన తమకు అనుకూలంగానే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సమైక్యాంధ్ర వాదానికి మద్దతుగా పార్లమెంటు సభ్యులు కూడా రాజీనామా చేయాలని సీమాంధ్ర కాంగ్రెసు శాసనసభ్యులు కోరుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X