వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణపై యుపిఎలో మిత్రభేదం
తెలగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల తృణమూల్ కాంగ్రెసు, ఎన్సీపి కూడా అయిష్టత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే చిన్నరాష్ట్రాల డిమాండ్లు ఊపందకుంటాయని, తెలంగాణ ప్రకటన చేయగానే గూర్ఖాలాండ్ కోసం దీక్షలు ప్రారంభమయ్యాయని తృణమూల్ కాంగ్రెసు నాయకురాలు మమతా బెనర్జీ అన్నారు. భాగస్వామ్య పక్షాలతో చర్చించకుండా భవిష్యత్తులో ప్రత్యేక విదర్భ సమస్య తలెత్తుతుందని ఎన్సీపి నేత శరద్ పవార్ అన్నట్లు సమాచారం. మిత్రులతో విభేదాలు పొడసూపడంతో ప్రధాని కార్యాలయం తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయకుండా శాంతి సామరస్యాలను కాపాడాలంటూ ప్రకటన చేసింది. రాష్ట్రంలో శాంతిసామరస్యాలను కాపాడడానికి ప్రజలు, పార్టీలు ప్రయత్నం చేయాలని ప్రధాని కార్యాలయం కోరింది.
Comments
Story first published: Wednesday, December 16, 2009, 8:57 [IST]