వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జగన్ ను హై కమాండ్ మందలించింది: పాల్వాయి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గబోదని, తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇచ్చిన మాట తప్పబోరని ఆయన అన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ నాయకుల అపోహలను తొలగించడానికి తమ పార్టీ అధిష్టానం ప్రయత్నిస్తోందని, అది పార్టీ అధిష్టానం బాధ్యత కూడా అని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని ఆయన అన్నారు. తెలంగాణ 53 ఏళ్ల పోరాట ఫలితమని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు అవసరమైన సబ్ కమిటీని వేస్తారని ఆయన అన్నారు.
Comments
Story first published: Wednesday, December 16, 2009, 13:36 [IST]