వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైక్రో ఫైనాన్స్ సంస్థల కట్టడికి ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vatti Vasanth Kumar
హైదరాబాద్: సూక్ష్మరుణ సంస్థలపై ప్రభుత్వం కొరడా ఝులిపించింది. రుణసంస్థల ప్రత్యేక చట్టానికి శుక్రవారం గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత మంత్రి వట్టి వసంత్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సూక్ష్మరుణ చట్టంలో పేర్కొన్న వాటిని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో ముందుంచారు.

సూక్ష్మరుణ సంస్థలు తమ పేర్లను ప్రభుత్వం దగ్గర నేటి నుండి 30 రోజుల్లోగా అనుమతుల కోసం నమోదు చేసుకోవాలని సూచించారు. సంవత్సరం పాటు ఆయా సంస్థలకు అనుమతి ఉంటుంది. అ తరువాత వారి వారి పనితీరుని బట్టి పొడిగిస్తాం. సంస్థలు వారు ఇచ్చే వడ్డీని సూచిక బోర్టులపై నిత్యం సూచించాలి. చట్టంలో ఉన్న నిబంధనలు పాటించకుంటే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నిబంధనలు పాటించని రుణ సంస్థలను రద్దు చేయటంతో పాటు మూడేళ్ల జైలు శిక్ష, ఒక లక్ష రూపాయలు జరిమానా విధిస్తారు. సూక్ష్మరుణ సంస్థల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటే 155321 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేయవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X