భాను కిరణ్ను అరెస్టు చేయలేదు: సూరి హత్య కేసుపై ఎకె ఖాన్
సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకే కాక మీడియాకు బాధ్యత ఉండాలన్నారు. వార్తల ప్రసారంలో మీడియా బాధ్యతాయుతంగా మెలగాలన్నారు. హింసాత్మక ఘటనలు ప్రసారం చేసిన ఓ ఛానల్ కు ఈ రోజు నోటీసులు జారీ చేశామని మిగతా టీవీ ఛానళ్లను కూడా గమనిస్తున్నామని చెప్పారు. ఓయు వీసీకి మూడు లేఖలు రాశామన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా ఓయు పేరు ప్రతిష్టలు దెబ్బతినకుండా చూడాలని కోరామన్నారు. భాను అరెస్టుపై ప్రశ్నించగా అతను తమ అదుపులో లేడన్నారు. గంపగుత్త మొబైల్ సందేశాలు పంపినవారిని గుర్తించామని, వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
Comments
Story first published: Saturday, January 8, 2011, 15:18 [IST]