హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అవసరమైతే విస్తరణ, బొత్స మంచి మనసుతోనే లేఖలు: సిఎం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: అవసరమైన సమయంలో మంత్రివర్గం విస్తరణ ఉంటుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సోమవారం విలేకరుల ప్రతినిధులతో అన్నారు. ముఖ్యమంత్రి సోమవారం కోస్తా జిల్లాలో మంజూరైన ప్రాజెక్టులపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అవసరమైనప్పుడు మంత్రివర్గం విస్తరణ ఉంటుందన్నారు. అయితే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున విస్తరణ చేయలేమని అన్నారు. తర్వాత ఎప్పుడైనా ఉండవచ్చునని చెప్పారు. కాగా త్వరలో నామినేటెడు పోస్టులు భర్తీ చేస్తామని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు అయిపోయాక వాటిపై దృష్టి సారిస్తామని చెప్పారు.

నామినేటెడ్ పోస్టుల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెసు ప్రభుత్వం గెలుపు సాధిస్తుందని ఆయన ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ఎమ్మెల్సీల గెలుపు బాధ్యత మాత్రం ఆయా జిల్లాల మంత్రులదే అన్నారు. నా బాధ్యత ఉన్నప్పటికీ వారి పాత్ర ఎక్కువ అని చెప్పారు. త్వరలో డిప్యూటీ సిఎం, స్పీకర్ పదవులపై కూడా ఒ కొలిక్కి వచ్చే అవకాశముందని చెప్పారు. వ్యవసాయ శాఖమంత్రి వైయస్ వివేకానందరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, ఎమ్మెల్సీగా పోటీ చేస్తారా అనే విషయాన్ని అధిష్టానం నిర్ణయిస్తుందని అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయ మంచి సూచనలతో తనకు లేఖ రాశారని అందులో తప్పు పట్టాల్సిన పని ఏముందన్నారు.

English summary
CM Kiran Kumar Reddy said monday that cabinet reshuffle will be done, when it need. He confident on MLC election winning.He monitored on Kotha projects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X