జగన్ వర్గం రాజీనామాలపై స్పీకర్ వెయిట్ అండ్ సీ

జగన్ వర్గానికి చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు స్పీకర్ను కలవాల్సి ఉంది. రెండు రోజుల విశాఖ పర్యటనకు వెళ్లిన స్పీకర్ మనోహర్ను జగన్ వర్గ ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాసు, కొర్ల భారతి కలిశారు. రాజీనామాలపై తమ నిర్ణయాన్ని స్పష్టం చేసేందుకు కొంత గడువు కావాలని వారు కోరినట్లు సమాచారం. రాజీనామాలపై తాము ఆలోచించుకోవాల్సి ఉందని అన్నట్లు తెలిసింది. అలాగే, పాయకరావుపేట ఎమ్మెల్యే, జగన్ మద్దతుదారుడు గొల్ల బాబూరావు ఆదివారం మధ్యాహ్నం స్పీకర్ను కలిశారు. విశాఖ పర్యటన ముగించుకుని తిరిగి వెళుతూ విమానాశ్రయానికి వచ్చారు. ఈ
సందర్భంగా మంత్రి బాలరాజు తదితరులతోపాటు బాబూరావు కూడా స్పీకర్ను కలిశారు.
స్పీకర్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇక, జగన్ వర్గానికి చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రదర్శించకుండా 15 రోజులు గడువు కావాలని కోరుతున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజీనామా చేసిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ మనోహర్ ఆచితూచి వ్యవహరించాలని భావిస్తున్నారు. రాజీనామాల అంశంలో ఆయా ఎమ్మెల్యేల అభిప్రాయాలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications