కష్టాలు చూస్తుంటే బాధగా ఉంది: ఓదార్పులో జగన్

ప్రజా సమస్యలపై ఆ పార్టీ నేతలకు చిత్తశుద్ధి లేదన్నారు. సమస్యలను ఎప్పుడో గాలికి వదిలేశాయన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని అప్రతిష్ట పాలు చేసేందుకే ఆ పార్టీలు శ్రద్ధ చూపిస్తున్నాయన్నారు. ప్రజల కష్టాలు చూస్తుంటే తనకు చాలా బాధేస్తుందన్నారు. టిడిపి, కాంగ్రెసులకు ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పంట రైతుల వద్ద ఉన్నప్పుడు రూ.700గానే ఉందని కానీ దళారుల చేతుల్లోకి వెళ్లాక రూ.1000 నుండి రూ.1500 వరకు పెరిగిందని విమర్శించారు. కాగా కారుమంచిలో ప్రారంభమైన జగన్ ఓదార్పు యాత్ర పైకల్లు, గుంటుపాలెం, భాస్కరనగర్, చినకంచర్ల, ముండ్రవారిపాలెం మీదిగా వెళుతోంది.












Click it and Unblock the Notifications