బేగంపేట విమానాశ్రయంలో ఫైర్, చార్టర్డ్ ప్లేన్స్ దగ్ధం

హైదరాబాద్లో ఉన్న 16 అగ్నిమాపక కేంద్రాల నుంచి అన్ని యంత్రాలనూ రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం నీటిని చల్లి మంటలను ఆర్పలేమన్న ఉద్దేశంతో అత్యాధునికంగా కార్బన్ డయాక్సైడ్ ఫోమ్తో మంటలు ఆర్పే యంత్రాలను రప్పించారు. తొలుత విమానాశ్రయంలో ఉన్న రెండు యంత్రాలతో మంటలు ఆర్పుతుండగానే అవి మరింత విస్తరించాయి. కాగా, అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటనపై సిబిసిఐడి దర్యాప్తునకు ఆదేశించారు.
విమానాలు, హెలికాప్టర్లలో ఉపయోగించే వైట్ పెట్రోలుకు మండే గుణం అధికంగా ఉంటుంది. ప్రమాదానికి గురైన షెడ్డులో ఈ ఇంధన బ్యారెళ్లు ఉండటం వల్లనే మంటలు ఎక్కువగా ఎగసిపడినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత పేలుడు శబ్దాలు కూడా వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. అందరూ నిద్రపోతున్న సమయంలో హఠాత్తుగా శబ్దాలు రావడంతో పాటు దట్టమైన పొగలు వ్యాపించడంతో విమానాశ్రయం చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉండేవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు.
కిలో మీటరు మేర పొగలు వ్యాపించాయి. శంషాబాద్లో కొత్త విమానాశ్రయం నిర్మాణం పూర్తయిన తర్వాత బేగంపేట నుంచి విమానాల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. కేవలం అతి ముఖ్యుల రాకపోకలకు, వైమానిక విన్యాసాలకు మాత్రమే దీన్ని ఉపయోగిస్తున్నారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి లాంటి విఐపిలు కూడా ఈ విమానాశ్రయం నుంచే రాకపోకలు సాగిస్తుంటారు.
-
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు












Click it and Unblock the Notifications