వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెవిలో పువ్వుల్లేవు: బాబు యాత్రపై గాదె, జగన్ పైనా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gade Venkat Reddy
హైదరాబాద్: తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆత్మగౌరవ యాత్ర చేస్తానంటే ప్రజలెవరూ చెవిలో పువ్వులు పెట్టుకొని లేరని మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు గాదె వెంకట రెడ్డి గురువారం అన్నారు.

విభజనపై తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలది దివాళాకోరుతనమన్నారు. ఆ రెండు పార్టీలు ఎప్పుడు సమైక్యాంధ్ర అనలేదని ఆరోపించారు. సమైక్యవాదాన్ని మొదటి నుండి వినిపిస్తోంది సీమాంధ్ర కాంగ్రెసు నేతలేనని, విభజన నిర్ణయాన్ని తాము స్వాగతించడం లేదని చెప్పారు.

ఢిల్లీ పరిణామాలు గమనిస్తున్నాం: శైలజానాథ్

తాము ఎప్పటికప్పుడు ఢిల్లీ పరిణామాలను గమనిస్తున్నామని మంత్రి శైలజానాథ్ అన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమం తమ బాధ్యతను మరింత పెంచిందన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కించపర్చేలా చంద్రబాబు లేఖ రాయడం సరికాదన్నారు.

ఆయన వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వచ్చే నెల 2, 3 తేదీల్లో హైదరాబాదులో దీక్షకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. విభజన విషయంలో చంద్రబాబు పునరాలోచించుకోవాలని హితవు పలికారు. సమైక్యాంధ్రకు ఇంకా అవకాశముందని, ఓట్ల రాజకీయాలను పక్కన పెట్టాలన్నారు.

English summary
Congress Party senior leader Gade Venkat Reddy on Thursday blamed TDP chief Nara Chandrababu Naidu and YSRCP chief YS Jaganmohan Reddy for state division.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X