క్వాలిటీ లోపం ఆరోపణలతో ముగ్గురు సీఆర్డీయే ఇంజనీర్లపై విచారణకు ఆదేశాలు
అమరావతి:ఇన్నర్ రింగ్ రోడ్డు పనుల్లో నాణ్యతా లోపం ఆరోపణలతో ముగ్గురు సిఆర్డీఏ ఇంజనీర్లపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణకు సంబంధించిన ఉత్తర్వులు అందుకున్న 10 రోజుల్లోగా ఈ ముగ్గురు ఇంజనీర్లు వ్రాతపూర్వక వివరణ ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది. వివరాల్లోకి వెళితే...
విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఫ్లైవోవర్లలో ప్రమాణాల మేరకు నాణ్యత ఏ మాత్రం లేదని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలకు సంబంధించి అప్పటి వీజీటీఎం ఉడా, ప్రస్తుతం ఏపీసీఆర్డీయేలో ఇంజినీర్లుగా పని చేస్తున్న ముగ్గురు అధికారులపై ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

వీజీటీఎం ఉడాలో ఈఈగా పని చేసి, ఇప్పుడు సీఆర్డీయేలో ఎస్.ఇ.గా ఉన్న బి.శ్రీనివాసరావు, అప్పట్లో డిప్యూటీ ఈఈగా ఉండి ప్రస్తుతం ఈఈగా పని చేస్తున్న ఎం.వి.సుబ్బారావు, అప్పట్లో ఏఈఈగా ఉండి ప్రస్తుతం డిప్యూటీ ఈఈగా పని చేస్తున్న ఎం.ఎస్.రామకృష్ణలు ఈ విచారణ ఎదుర్కోనున్నారు. ఎంక్వైరీ ఉత్తర్వులు అందిన 10 రోజుల్లోగా పైన పేర్కొన్న ముగ్గురు అధికారులు తమపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి లిఖితపూర్వక స్టేట్మెంట్ను ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. వారు సకాలంలో తగురీతిన వివరణ ఇవ్వని పక్షంలో ప్రభుత్వం వద్ద ఇప్పటికే ఉన్న సమాచారం ఆధారంగా తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
-
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications