ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 51,603 ఎకరాల భూములను నిషేధ జాబితా 22ఏ నుంచి తొలగించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. అలాగే పక్షం రోజుల్లోగా.. రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా ఉన్నవాటిని పట్టా భూములుగా మార్చి ఆ సంస్థ పేరిట మ్యుటేషన్ చేయాలని స్పష్టంచేసింది. ప్రజలకు పరిహారం చెల్లించిన అనంతరం ఏపీఐఐసీ చేతిలో ప్రభుత్వ భూములు, డీకెటీ భూములును నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
నిషేధ జాబితాలో ఉన్న పారిశ్రామిక భూములపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎలాంటి అభ్యంతరాలు లేని 70 వేల ఎకరాల ఏపీఐఐసీ భూములను 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించడానికి అనుమతించింది. అధికారిక లెక్కల ప్రకారం.. ఇప్పటి వరకు 1.56 లక్షల ఎకరాలను ఏపీఐఐసీకి కేటాయించగా.. వాటిలో 1,21,603 ఎకరాలు ఇప్పటికీ నిషేధ జాబితాలో ఉండడం గమనార్హం. ఇందులో 70 వేల ఎకరాల ప్రభుత్వ, డీకేటీ (అసైన్డ్) భూములు కూడా ఉన్నాయి. ప్రభుత్వ భూములు అందుబాటులో లేనిచోట భూ సేకరణ చట్టం కింద 51,603 ఎకరాల పట్టా భూములను సేకరించి ఇచ్చారు. అనేక ప్రాంతాల్లో అసైన్డ్ భూములకు కూడా పరిహారం ప్రకటించి సేకరించారు. వీటిని ఏపీఐఐసీ అనేక పరిశ్రమలకు మార్కెట్ ధరకు కేటాయించింది. అంటే ఆయా పరిశ్రమలు ప్రభుత్వం నిర్ణయించిన ధరను ఏపీఐఐసీకి చెల్లించి భూములు తీసుకున్నాయి. అయినా ఇప్పటికీ అవి రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూములుగానే నమోదయి ఉన్నాయి. వాటి వర్గీకరణ, స్వభావం మార్చలేదు.

ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో విధి విధానాలు
దీంతో, ఆయా పరిశ్రమలు ఆ భూములను తనఖాపెట్టి రుణాలు తీసుకోలేకపోతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని పరిశ్రమలు, కంపెనీలు, ఏపీఐఐసీ ప్రభుత్వాన్ని దీర్ఘకాలంగా కోరుతు న్నాయి. ఇప్పటికే పారిశ్రామిక రాయితీలను నేరుగా కంపెనీలకే చెల్లించేందుకు ఎస్ర్కో ఖాతా తెరచిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు అనూహ్యంగా, వాటికిచ్చిన భూముల స్వభావం, క్లాసిఫికేషన్ మార్చడంతో పాటు నిషేధం నుంచి విముక్తి కల్పించాలని కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత 51,603 ఎకరాలను 22ఏ నుంచి తొలగించాలని పరిశ్రమల శాఖ కార్యదర్శి ఉత్తర్వులు (జీవో 61) జారీ చేశారు. తర్వాత వాటిని ఏపీఐఐసీ పేరిట పట్టా భూమిగా మ్యుటేషన్ చేయాలని.. ఇదంతా యుద్ధప్రాతిపదికన చేపట్టాలని.. మొత్తం ప్రక్రియను 15 రోజుల్లోగా పూర్తిచేయాలని కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లు, సబ్రిజిస్ట్రార్లను ఆదేశించారు. దీంతోపాటు భూముల మ్యుటేషన్, భూ కేటాయింపు ప్రతిపాదనలు, ఇంకా నిషేధ జాబితా నుంచి విముక్తి కల్పించడానికి అనుసరించాల్సిన విధివిధానాలనూ ఉత్వర్వుల్లో స్పష్టం చేసారు.
-
మంత్రాలయం వెళ్లేవారికి గుడ్ న్యూస్.. నేషనల్ హైవే 167పై కొత్తగా బైపాస్! -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
జగన్ 'మావిగన్' ప్రతిపాదన వెనుక, కూటమి నేతలకు చంద్రబాబు కీలక పిలుపు..!! -
Amaravati Bill: అమరావతి గొంతుకనవుతా..! సాయిరెడ్డి బిగ్ ట్విస్ట్..! -
Amaravati: అమరావతికి కేంద్రం మరో గిఫ్ట్-బిల్లు ఆమోదించిన 24 గంటల్లో..! -
Mavigun Vs Amaravati: అమరావతి కంటే మావిగాన్ ఎలా బెటర్ ? అంబటి వివరణ..! -
శూన్యం నుంచి సృష్టి వరకు.. చరిత్ర నిన్ను క్షమించదు జగన్ -
ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్-బకాయిలపై చంద్రబాాబు ఆదేశాలు..! -
సాష్టాంగ ప్రణామం.. ఆంధ్రుల ఆత్మగౌరవానికి దక్కిన విజయం -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
మండలిలో 'చీకటి' రోజు.. బయటపడ్డ వైసీపీ అరాచకాలు! -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!!










Click it and Unblock the Notifications