AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..!
ఏపీలో ప్రభుత్వం (ap govt) ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న పేదల ఇళ్ల పంపిణీకి ఎట్టకేలకు రంగం సిద్దమైంది. గతేడాది నుంచీ ఉగాదికి ఇళ్ల పంపిణీ చేపడతామంటూ చెబుతూ వచ్చిన ప్రభుత్వం.. సకాలంలో వాటిని సిద్దం చేయలేకపోయింది. దీంతో ఇవాళ 2.5 లక్షల ఇళ్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సీఎం చంద్రబాబు తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఇవాళ జరిగే ఓ కార్యక్రమంలో వీటిని లబ్దిదారులకు అందజేయబోతున్నారు.
రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం ఆవాస్ యోజన పథకం సాయంతో ప్రభుత్వం పూర్తి చేసిన ఇళ్లు, అలాగే టిడ్కో పథకం కింద నిర్మించిన ఇళ్లను ప్రభుత్వం ఇవాళ లబ్దిదారులకు పంపిణీ చేయబోతోంది. వీటి కోసం లబ్దిదారులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా టిడ్కో ఇళ్లను దాదాపుగా పూర్తి చేసినా ప్రభుత్వం మారడంతో వాటిలో చాలా వరకూ నిలిచిపోయాయి. తిరిగి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు మొదలుపెట్టి పూర్తి చేసింది.. ఇలా పూర్తి చేసిన లక్ష టిడ్కో ఇళ్లతో పాటు కాలనీల్లో నిర్మించిన మరో 1.5 లక్షల ఇళ్లు కలుపుకుని మొత్తం 2.5 లక్షల ఇళ్లను ఇవాళ పంపిణీ చేయబోతున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇళ్ల నిర్మాణం, పంపిణీని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తొలి ఏడాదే 3 లక్షల ఇళ్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఇప్పుడు మరో 2.5 లక్షల ఇళ్లను పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ లెక్కన 21 నెలల కూటమి పాలనలో 5.5 లక్షల మంది లబ్దిదారులకు ఇళ్లు పంపిణీ చేసినట్లు అవుతోంది. మరోవైపు టిడ్కో లబ్దిదారుల నుంచి గతంలో డబ్బులు వసూలు చేసి ఇళ్లు పూర్తి చేయలేకపోయిన వారికి సదరు మొత్తాల్ని తిరిగి ఇచ్చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కాబట్టి వారికి డబ్బులు వెనక్కి రాబోతున్నాయి. అర్హులైన మిగిలిన వారికి మాత్రం ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఇవ్వబోతున్నారు.
-
ఏపీలోకి తమిళనాడు, పుదుచ్చేరి బోట్లు-చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం దెబ్బ ఏపీ రోడ్లకు.. ఎలాగంటే -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
మంత్రాలయం వెళ్లేవారికి గుడ్ న్యూస్.. నేషనల్ హైవే 167పై కొత్తగా బైపాస్! -
చెరువుల పక్కన ప్రభుత్వ భూములపై హైడ్రా కమిషనర్ కీలక ఆదేశాలు! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం..














Click it and Unblock the Notifications