వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుట్ర: విభజనపై జెపి, రేపు వ్యూహం: అశోక్ బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayaprakash Naryana
విశాఖపట్నం/ హైదరాబాద్: రాష్ట్ర ప్రజల అంగీకారం లేకుండా కుట్రపూరిత ఆలోచనలతో రాష్ట్ర విభజన చేస్తున్నారని లోకసత్తా జాతీయాధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ మండిపడ్డారు. తాత్కాలిక రాజకీయ ప్రయోజనం కోసం నిర్ణయం తీసుకుని ప్రజల మధ్య అగాధాన్ని సృష్టించారని ఆయన శుక్రవారం విశాఖపట్నంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

విభజన నిర్ణయంతో కోస్తాంధ్ర గుండెకు గాయమైందని ఆయన అన్నారు. తెలుగు ప్రజల మనోభావాలను శానససభలో వ్యక్తం చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

రాష్ట్ర విభజన అంశంపై అన్ని గ్రామాల నుంచి తీర్మానాలు తీసుకుని రాష్ట్రపతి, శానససభ స్పీకర్‌లకు పంపిస్తామని ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి. అశోక్ బాబు చెప్పారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై రాజకీయ నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

అసెంబ్లీ లోపల, వెలుపల ఎటువంటి వ్యూహాలు అనుసరించాలో శనివారం చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. సమ్మె అనివార్యమైతే చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. విభజన ఎందుకు చేయకూడదనే విషయంపై శాసనసభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించాలని ఆయన సూచించారు.

English summary
Loksatta national president Jayaprakash narayan alleged that there a conspiracy in dividing Andhra Pradesh state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X