సీమాంధ్ర మంత్రి వ్యాఖ్యలకు తెరాస మద్దతు, టిడిపి నో
బిల్లుపై చర్చలో మాట్లాడుతూ... విభజన విషయంలో కాంగ్రెసు పార్టీ అభిప్రాయానికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. దాంతో ఆయనను సీమాంధ్ర ద్రోహి అంటూ సీమాంధ్ర టిడిపి ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. వారికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యులు నినాదాలు చేస్తూ బాలరాజుకు మద్దతుగా నిలబడ్డారు. సభలో గందరగోళం ఏర్పడటంతో సభాపతి సభను ఐదు నిమిషాలు వాయిదా వేశారు.
అనంతరం సభ తిరిగి ప్రారంభమయ్యాక కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. సీమాంధ్ర టిడిపి శాసన సభ్యులు పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. పోటీగా తెరాస ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
సీమాంధ్ర టిడిపి ఎమ్మెల్యేలు బాలరాజుకు క్షమాపణ చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. ఈటెల వ్యాఖ్యలపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈటెల ఆగ్రహంతో ఖబడ్దార్.. బీ కేర్ ఫుల్ అంటూ సీమాంధ్ర టిడిపి నేతలను హెచ్చరించారు.