Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షాకింగ్: నిమ్మగడ్డపై చైనా హ్యాకర్ల కన్ను -ఇంటర్‌పోల్ దర్యాప్తు -ఎస్ఈసీపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫైర్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థ ఎన్నికలు ప్రశాతంగా, విజయవంతంగా జరిగినప్పటికీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, జగన్ సర్కారుకు మధ్య విభేదాలు, వివాదాలు మత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మంత్రుల గౌరవానికి భంగం కలిగించేలా లేఖలు రాశారంటూ ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నిమ్మగడ్డకు నోటీసులివ్వగా, అసలా లేఖలు బయటికెలా లీక్ అయ్యాయో తేల్చండంటూ ఎస్ఈసీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పరిణామాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అనూహ్య వ్యాఖ్యలు చేశారు.

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

ఎన్నికల కమిషనర్ హోదాలో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి గవర్నర్‌కు తాను రాసిన లేఖల్లోని వివరాలు లీక్ అయ్యాయని, ప్రజా వినియోగానికి సంబంధంలేని సదరు లేఖలను సాధారణ ప్రజానీకానికి, మీడియాకు బహిర్గతం చేయడానికి వీల్లేకున్నా, కొందరు వ్యక్తులు తమ స్వార్ధ ప్రయోజనం కోసం వాటిని లీక్ చేశారని, ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ జరిపించేలా ఆదేశాలివ్వాలంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గత శనివారం(మార్చి 20న) హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. దీనికి..

హైకోర్టు పరిధిలో ఉండగా..

హైకోర్టు పరిధిలో ఉండగా..

గవర్నర్ కు తాను రాసిన లేఖల్లోని అంశాల ఆధారంగానే మంత్రుల ప్రివిలేజ్ నోటీసులున్నాయన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ.. లీకైన లేఖలను జత చేస్తూ మెట్టు రామిరెడ్డి అనే వ్యక్తి పరిషత్‌ ఎన్నికల కోసం హైకోర్టులో మరో పిటిషన్ వేయడాన్ని ప్రస్తావించారు. సీఎం సహా మంత్రుల్లో కొందరు కులాన్ని కూడా ప్రస్తావిస్తూ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారనీ నిమ్మగడ్డ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉండగా, వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం ట్విటర్ వేదికగా నిమ్మగడ్డపై విమర్శలు గుప్పించారు.

నిమ్మగడ్డపై చైనా హ్యాకర్ల కన్ను

నిమ్మగడ్డపై చైనా హ్యాకర్ల కన్ను

హైకోర్టులో ఎస్ఈసీ దాఖలు చేసిన ఫిర్యాదులో కులం అంశాన్ని కూడా చేర్చిన దరిమిలా, వైసీపీ ఎంపీ సాయిరెడ్డి మరోసారి దానిని ప్రస్తావిస్తూ.. ''పచ్చకుల బ్యాచ్‌కు నిమ్మగడ్డే తన లెటర్లను లీక్ చేస్తాడు''అని విమర్శించారు. మళ్లీ ఇదేదో జాతీయ సమస్య అన్నట్లు సీబీఐ ఎంక్వైరీ కోసం డిమాండ్ చేశారని, ఏపీ పోలీసులైతే మళ్లీ తననే ఇరికిస్తారేమో అని నిమ్మగడ్డ జంకుతున్నారని, నిజానికి నిమ్మగడ్డ ఇంటర్ పోల్ లేదా స్కాట్ లాండ్ యార్డ్ పోలీసుల దర్యాప్తు కోరాల్సిందని సాయిరెడ్డి మండిపడ్డారు. నిమ్మగడ్డ చెత్త లేఖలు, సీక్రెట్ మీటింగ్ లపై చైనా హ్యాకర్ల కన్నుపడిందేమో అని వైసీపీ ఎంపీ రాసుకొచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+