ఆడియో కాల్స్ కలకలం: రాజీనామాకు పట్టు, బెదిరింపులు, పేరు మార్చి
మునుగోడుతో రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక వచ్చిన సంగతి తెలిసిందే. అంతకుముందు హుజురాబాద్ బై పోల్ జరిగింది. ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయడంతో.. ఎన్నిక అనివార్యమైంది. అయితే ఆ సమయంలో నియోజకవర్గంలో గల కొందరికీ/ సామాజిక వర్గాలకు మేలు జరిగింది. ఇప్పుడు మునుగోడులో మద్యం/ డబ్బుల ప్రవాహం కొనసాగుతోంది.

రాజీనామాకు పట్టు..
ఆ రెండు ఎన్నికలను చూసి.. తమ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయాలని కోరుతున్నారు. అలా కొందరికీ నిరసన సెగ తగులుతుంది. మీరు రాజీనామా చేస్తే.. నియోజకవర్గం అభివృద్ది చెందుతుందని కామెంట్ చేశారు. నిన్న మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి ఇలాంటి సిచుయేషన్ వచ్చింది. ఇప్పుడు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి కూడా అలాంటి పరిస్థితే.. ఆయనకు వరసగా ఫోన్లు వస్తున్నాయి.

ఓహ్.. అవునా..
పద్మా దేవేందర్ రెడ్డికి కాల్ రాగా.. ఆమె సున్నితంగా బదులిచ్చారు. కానీ మదన్ రెడ్డి మాత్రం అదేస్థాయిలో రిప్లై ఇచ్చారు. నాకేం.. అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఆ కాల్ రికార్డ్ సోషల్ మీడియాలో తిరుగుతుంది. సో.. అందరూ నేతలు ఓకేలా ఉండరు. సో .. ఫోన్ చేసినా, అడిగినా.. కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. లేదంటే కొందరు నేతల నుంచి ప్రతిస్పందన ఎదుర్కొవాల్సి వస్తోంది.

పీఏ మాత్రం..
అటు పద్మా దేవేందర్ రెడ్డి పీఏ వివాదంలో ఇరుక్కున్నారు. నిన్న కాల్ చేసిన టెక్రియాల్కు చెందిన స్వామిని ఫోన్ చేసి మరీ బెదిరించాడు. ఎమ్మెల్యేతో ఫోన్ చేసి.. రికార్డ్ ఎందుకు చేశావు అని అడుగుతున్నాడు. దానిని వాట్సాప్ గ్రూపులో ఎందుకు పెట్టావని అడిగాడు. ఆ ఆడియో కూడా ట్రోల్ అవుతుంది.నిజానికి పద్మా దేవేందర్ రెడ్డి పీఏ పేర రాజశేఖర్.. కానీ అతను మాత్రం విష్ణువర్దన్ రెడ్డి అని చెప్పారు. దీంతో అతను తప్పించుకోవాలనే.. పేరు మార్చినట్టు అర్థం అవుతుంది.












Click it and Unblock the Notifications