సిట్ అధికారిపై ఏసీబీ కోర్టు అగ్రహం.. డైరెక్షన్ ఇవ్వటానికి మీరెవరంటూ ప్రశ్న..
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిట్ అధికారి గంగాధర్ పై ఏసీబీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుల బెయిల్ షూరిటీలో స్థానికులనే పరిగణలోకి తీసుకోవాలని.. సిట్ మెమో జారీ చేయడంపై న్యాయమూర్తి మండిపడ్డారు. షూరిటీలపై డైరెక్షన్ ఇవ్వటానికి మీరెవరంటూ నిలదీసింది. బేరతుగా క్షమాపణలు చెప్పకుంటే... కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని స్ఫష్టం చేసింది. కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సిట్ అధికారి ఏసీపీ గంగాధర్ కోర్టుకు క్షమాపణ చెప్పారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులకు హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిలకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ప్రతీ సోమవారం సిట్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేసేలా వ్యవహరించొద్దని స్పష్టం చేసింది. నిందితులంతా పాస్ పోర్టులను సిట్ ఇవ్వాలని కోర్టు చెప్పింది. రూ.3 లక్షల పూచికత్తుతో పాటు ఇద్దరు వ్యక్తుల షూరిటీతో బెయిల్ మంజూరు చేసింది.

ఈ షూరిటీ ఇచ్చే వారు స్థానికులు అయి ఉండాలని సిట్ మెమో ఇచ్చింది. దీంతో కోర్టు సిట్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా నిందితులు 34 రోజులుగా చంచల్గూడ జైలులో ఉన్నారు.ఈ కేసులు ఇప్పటికే సిట్ పలు సార్లు నిందితులను విచారించింది. ఈ కేసుతో సంబంధం ఉన్నవారికి నోటీసులు కూడా జారీ చేసింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications