సిట్ అధికారిపై ఏసీబీ కోర్టు అగ్రహం.. డైరెక్షన్ ఇవ్వటానికి మీరెవరంటూ ప్రశ్న..
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిట్ అధికారి గంగాధర్ పై ఏసీబీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుల బెయిల్ షూరిటీలో స్థానికులనే పరిగణలోకి తీసుకోవాలని.. సిట్ మెమో జారీ చేయడంపై న్యాయమూర్తి మండిపడ్డారు. షూరిటీలపై డైరెక్షన్ ఇవ్వటానికి మీరెవరంటూ నిలదీసింది. బేరతుగా క్షమాపణలు చెప్పకుంటే... కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని స్ఫష్టం చేసింది. కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సిట్ అధికారి ఏసీపీ గంగాధర్ కోర్టుకు క్షమాపణ చెప్పారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులకు హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిలకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ప్రతీ సోమవారం సిట్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేసేలా వ్యవహరించొద్దని స్పష్టం చేసింది. నిందితులంతా పాస్ పోర్టులను సిట్ ఇవ్వాలని కోర్టు చెప్పింది. రూ.3 లక్షల పూచికత్తుతో పాటు ఇద్దరు వ్యక్తుల షూరిటీతో బెయిల్ మంజూరు చేసింది.

ఈ షూరిటీ ఇచ్చే వారు స్థానికులు అయి ఉండాలని సిట్ మెమో ఇచ్చింది. దీంతో కోర్టు సిట్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా నిందితులు 34 రోజులుగా చంచల్గూడ జైలులో ఉన్నారు.ఈ కేసులు ఇప్పటికే సిట్ పలు సార్లు నిందితులను విచారించింది. ఈ కేసుతో సంబంధం ఉన్నవారికి నోటీసులు కూడా జారీ చేసింది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications