షాక్: బిజెపిలో చేరిన ఆప్ ఎమ్మెల్యే వేద్ ప్రకాష్, 35 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తి
మున్సిఫల్ ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వేద్ ప్రకాష్ సతీష్ పార్టీకి రాజీనామా చేసి సోమవారం నాడు బిజెపిలో చేరారు.
ఢిల్లీ: మున్సిఫల్ ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వేద్ ప్రకాష్ సతీష్ పార్టీకి రాజీనామా చేసి సోమవారం నాడు బిజెపిలో చేరారు.
బిజెపి ఢిల్లీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మనోజ్ తివారీ ఆధ్వర్యంలో వేద్ ప్రకాష్ బిజెపిలో చేరారు. 2015 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయడంలో ఆప్ వైఫల్యం చెందిందని ఆయన ఆరోపించారు.

ఈ కారణంగానే తాను ఆప్ ను వదిలి బిజెపిలో చేరుతున్నట్టుగా ఆయన ప్రకటించారు.భావనా అసెంబ్లీ స్థానం నుండి ఆయన ప్రాతినిథ్యం వహించారు.అయితే ఎమ్మెల్యే పదవికి కూడ తాను రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.
మరో వైపు పార్టీలోని అన్ని పదవుల నుండి తాను తప్పుకొంటున్నట్టు ఆయన చెప్పారు.స్పీకర్ కు తన రాజీనామా లేఖను అందించనున్నట్టు ఆయన తెలిపారు.
పార్టీలో దాదాపుగా 35 మంది ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారని ఆయన చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజలకు పార్టీ ఇచ్చిన హమీలను నెరవేర్చడం లేదని వేద్ ప్రకాష్ మీడియాకు వివరించారు.
ఇప్పటికే దేవేంద్ర షెకావత్, పంకజ్ పుష్కరం, సందీప్ కుమార్ లు పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని ఆయన చెప్పారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications