ముఖేష్ అంబానీకి సెక్యూరిటీ భయం .. స్కార్పియో యజమాని మర్డర్ , కేసు ఏటీఎస్ కు బదిలీ
స్కార్పియో వాహనంలో జిలెటిన్ స్టిక్స్ పెట్టి ముఖేష్ అంబానీ కి హెచ్చరిక లేఖ రాసిన ఈ వ్యవహారంలో ఊహించని విధంగా స్కార్పియో వాహనం యజమాని మన్సుఖ్ హిరెన్ మృతి చెందిన విషయం తెలిసిందే .అయితే మన్సుఖ్ హిరెన్ మృతికేసును మర్డర్ కేసుగా పోలీసులు కేసును యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కు బదిలీ చెయ్యటం కలకలం రేపింది . మొదట కారు యజమాని మృతి ఆత్మహత్యగా భావించిన పోలీసులు దర్యాప్తు అనంతరం కేసును మర్డర్ గా గుర్తించి ఏటీఎస్ కు బదలాయించటంతో పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీకి ప్రమాదం పొంచి ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ముఖేష్ అంబానీకి బాంబు బెదిరింపు .. స్కార్పియో వాహనం మన్సుఖ్ హిరెన్ మరణంతో కేసులో కొత్త మలుపు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ ఇంటి దగ్గరలో పేలుడు పదార్థాల కలకలం సృష్టించిన విషయం తెలిసిందే . ఇటీవల ఆంటిలియా సమీపంలో జెలిటిన్ స్టిక్స్ ఉన్న స్కార్పియో ను గుర్తించిన ముంబై పోలీసులు ఆ కారులో అంబానీ కుటుంబానికి ఓ బెదిరింపు లేఖను కూడా గుర్తించారు. స్కార్పియో వాహనం ఎవరిదన్న కోణంలో దర్యాప్తు చేశారు. స్కార్పియో వాహనం రిజిస్టర్డ్ యజమాని మన్సుఖ్ హిరెన్ ను గుర్తించిన పోలీసులు అతనిని విచారించారు. అతను తన వాహనం దొంగిలించబడిందని పోలీసులకు చెప్పారు. ఆ వాహన యజమాని సడన్ గా మరణించటం కేసులో ఉత్కంఠను రేపుతుంది .

అంబానీకి బాంబు బెదిరింపు కేసులో మన్సుఖ్ మాత్రమే కీలక సాక్షి .. కేసు మళ్ళీ మొదటికి
ఈ కేసులో మన్సుఖ్ హిరెన్ మాత్రమే కీలక సాక్షి . ఇంతకు మించి ఈ కేసును విచారించటానికి ఎలాంటి ఆధారాలు లేవు . అయితే ఊహించని విధంగా ఇంటి నుండి బయటకు వెళ్ళిన మన్సుఖ్ హిరెన్ హత్యకు గురయ్యారు. ఆయన మృతదేహం కల్వా క్రీక్లో, థానేలోని రెతి బందర్ ప్రాంతంలో కనుగొనబడింది. గురువారం రాత్రి కందివాలి యూనిట్ నుండి క్రైమ్ బ్రాంచ్ అధికారిని కలవడానికి తాను థానేలోని ఘోడ్బందర్ ప్రాంతానికి వెళుతున్నానని హిరెన్ తన కొడుకుతో చెప్పి, అతను ఆటోలో వెళ్ళాడు కానీ హిరెన్ ఇంటికి తిరిగి రాలేదు. హిరెన్ ఇంటికి రాలేదని మరుసటి రోజు తెల్లవారు ఝామున మిస్సింగ్ కేసు నమోదు చేశారు . ఆతర్వాత శవమై కనిపించాడు .

హిరెన్ ను చంపి ఆపై కాలువలో పడేసినట్టు పేర్కొన్న హిరెన్ కుటుంబ సభ్యులు
హిరెన్ అన్నయ్య వినోద్ మాట్లాడుతూ ఇది హత్య అని చెప్పాడు. మన్సుఖ్ హిరెన్ కు బాగా ఈత వచ్చని, ఆయన ఒక క్రీక్ లోకి దూకి తన జీవితాన్ని అంతం చేసుకునేంత పిరికివాడు కాదని పోలీసులకు వెల్లడించారు .
అతని నోట్లో గుడ్డలు కుక్కి మృతదేహం లభించిందని పోలీసులు తెలిపారని ఆయన పేర్కొన్నారు . కాల్వలో పడేయటానికి ముందే చంపినట్టు పోలీసులు చెప్పారన్నారు .
పోస్ట్మార్టం నిర్వహించిన కల్వాలోని ఛత్రపతి శివాజీ ఆసుపత్రి వైద్యులు మరణానికి గల కారణాలపై తమ అభిప్రాయాన్ని రిజర్వు చేసుకోగా, శరీరానికి ఎక్కడా ఎలాంటి గాయం లేదని వారు తెలిపారు.

ఇంకా దొరకని హిరెన్ మొబైల్ ... దర్యాప్తు చేస్తున్న ముంబ్రా , క్రైం బ్రాంచ్ పోలీసులతో పాటు ఏటీఎస్ అధికారులు
హిరెన్ శుక్రవారం రాత్రి థానే తన కార్యాలయం నుండి బయలుదేరాడు మరియు రాత్రి 10.30 తర్వాత అతని మొబైల్ స్విచ్ ఆఫ్ చేయబడింది. దర్యాప్తులో, పోలీసులు మొబైల్ ఫోన్ సిగ్నల్స్ చివరగా వాసాయి సమీపంలోని ఒక గ్రామం వద్ద గుర్తించారు . అయితే, పోలీసులు ఇంకా మొబైల్ ఫోన్ను రికవరీ చేయలేదు. హిరెన్ యొక్క వస్తువులు ఏమయ్యాయో , అతన్ని రేతి బందర్ వద్దకు ఎలా తీసుకెళ్ళారో తెలుసుకోవడానికి పోలీసులు ఇంకా ప్రయత్నిస్తున్నారు. ముంబ్రా పోలీసులతో పాటు క్రైమ్ బ్రాంచ్ ఈ విషయాన్ని పరిశీలిస్తోంది. ఉగ్రవాద నిరోధక దళ అధికారులు శనివారం ఉదయం రేతి బందర్ను సందర్శించారు, ఇంకా ముంబై, థానే పోలీసుల నుంచి దర్యాప్తు పత్రాలను పరిశీలించనున్నారు .

మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఏటీఎస్ .. అంబానీ కేసు మరింత తీవ్ర రూపం
థానేలోని వారి నివాసంలో అధికారులు మన్సుఖ్ కుటుంబాన్ని విచారించిన ఒక రోజు తర్వాత ఈ కేసును శనివారం అధికారికంగా ఎటిఎస్కు అప్పగించారు. ఉదయం 11 గంటల నుండి నాలుగు గంటలకు పైగా విచారణ జరిగింది, అక్కడ అధికారులు మన్సుఖ్ కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను తీసుకున్నారు .
ఎటిఎస్ అధికారులు ఈ మిస్టరీ మరణంపై హత్య, నేరపూరిత కుట్ర, సాక్ష్యాలను నాశనం చేయడం, ఉమ్మడి ఉద్దేశం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును ఏసీపీ స్థాయి అధికారి విచారిస్తున్నారు. దీంతో ముఖేష్ అంబానీకి బాంబు బెదిరింపు కేసు మరింత తీవ్ర రూపం దాల్చింది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications