నేడే అన్నా హజారే సత్యాగ్రహం: నిరసనకారుల రైళ్ల రద్దు
Recommended Video

న్యూఢిల్లీ: అవినీతికి వ్యతిరేకంగా సామాజిక కార్యకర్తల అన్నా హజారే శుక్రవారం నుంచి నిరవధిక దీక్ష చేపట్టనున్నారు. దాదాపు ఏడేళ్ల క్రితం ఆయన చేపట్టిన ఆందోళన అప్పటి ప్రభుత్వాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే.
ఈసారి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన దీక్షకు దిగుతున్నారు. ఆయన దీక్షష ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్లో జరగనుంది. 2011లో ఆయన ఇక్కడే దీక్ష చేపట్టారు.

నిరసనకారులతో ఢిల్లీకి వస్తున్న రైళ్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని అన్నా హజారే విమర్శించారు. రైళ్లను రద్దు చేయడం ద్వారా వారు హింసకు దిగాలని అనుకుంంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. తన కోసం కూడా పోలీసు బలగాలను మోహరించారని, తనకు పోలీసు రక్షణ అవసరం లేదని స్పష్టం చేస్తూ చాలా సార్ల లేఖలు రాశానని ఆయన అన్నారు.
చట్టం ఉన్నప్పటికీ అవినీతి కేసుల దర్యాప్తునకు లోక్పాల్ను కేంద్ర ప్రభుత్వం నియమించడం లేదని ఆయన అంతకు ముందు అన్నారు. అన్నా హజారే తొలుత రాజ్ ఘాట్కు వెళ్లి అక్కడ నివాళులు అర్పించి, ఆ తర్వాత రామ్ లీలా మైదాన్కు చేరుకుంటారు.
మార్చి 23వ తేదీ బ్రిటిష్ ప్రభుత్వం భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్లను ఉరి తీసిన రోజు. అందుకే తన దీక్షకు హజారే ఈ రోజును ఎంచుకున్నారు. నిరసనకు వేలాది మంది తరలివస్తారని అంటున్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications