జమ్మూ బోర్డర్ లో మరో పాకిస్తానీ డ్రోన్ కలకలం .. కాల్పులు జరిపిన బీఎస్ఎఫ్ దళాలు !!
జమ్మూకశ్మీర్ సరిహద్దులలో తాజాగా డ్రోన్ల దాడితో, ఆ తర్వాత వరుసగా మిలటరీ క్యాంప్ వద్ద డ్రోన్లు కలకలం సృష్టించడంతో సీరియస్ గా తీసుకున్న ఆర్మీ నిఘా పెంచింది. వైమానిక స్థావరంపై డ్రోన్ల దాడికి పాల్పడిన తర్వాత నుండి వరుసగా భద్రతా దళాలు డ్రోన్లను గుర్తిస్తూనే ఉన్నారు. తాజాగా జమ్మూ జిల్లాలోని ఆర్నియా సెక్టార్లోని ఇండో-పాక్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న అనుమానాస్పదంగా ఎగురుతున్న పాకిస్తాన్ క్వాడ్కాప్టర్పై సరిహద్దు భద్రతా దళం బిఎస్ఎఫ్ ఈరోజు తెల్లవారుజామున కొన్ని రౌండ్లు కాల్పులు జరిపింది. దీంతో డ్రోన్ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళిపోయింది.
బిఎస్ఎఫ్ జమ్మూ సరిహద్దు ఇన్స్పెక్టర్ జనరల్ ఎన్ఎస్ జమ్వాల్ మాట్లాడుతూ పాకిస్తానీ డ్రోన్ జీరో లైన్ మరియు సరిహద్దు కంచె మధ్య తిరుగుతున్నట్టు గుర్తించి అప్రమత్తమైన బీఎస్ఎఫ్ సిబ్బంది కాల్పులు జరిపారని వెల్లడించారు. ఇది పాకిస్తాన్ భూభాగంలోకి తిరిగి వెళ్లిందని పేర్కొన్నారు. ఇది నిఘా కోసం ఉపయోగించే గూడచారి క్వాడ్కాప్టర్ అని జమ్వాల్ చెప్పారు. డ్రోన్ తిరిగిన ప్రాంతాన్ని పరిశీలించామని, ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఏమి లభించలేదని ఆయన చెప్పారు.

ఇంటిలిజెంట్ హెచ్చరికల ఆధారంగా బిఎస్ఎఫ్ దళాలు శుక్రవారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో పాకిస్తాన్కు చెందిన క్వాడ్కాప్టర్పై కాల్పులు జరిపాయని ఈ కాల్పుల కారణంగా, అది వెంటనే తిరిగి వెళ్లిపోయిందని, డ్రోన్ ఈ ప్రాంతాన్ని పర్యవేక్షించడానికి నిఘా కోసం ఉద్దేశించబడిందని చెప్పారు. డ్రోన్ కనిపించిన వెంటనే బిఎస్ఎఫ్ దళాలు 20 నుండి 25 రౌండ్ల వరకు కాల్పులు జరపగా, పాకిస్తానీ డ్రోన్ తిరిగి వెనక్కి వెళ్ళింది అంటూ పేర్కొన్నారు.
జమ్మూలోని ఐఎఎఫ్ స్టేషన్పై ఆదివారం జరిగిన డ్రోన్ దాడిలో ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు, తరువాత కాలూచక్, రత్నుచక్, సుంజువాన్ మరియు కుంజ్వానీలోని సైనిక స్టేషన్లపై డ్రోన్ లు వరుసగా నాలుగు రోజులుగా నిత్యం తిరుగుతూ కలకలం సృష్టిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు డ్రోన్ల వాడకాన్ని కొత్త సవాలుగా ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే పేర్కొన్నారు. డ్రోన్ దాడి కేసుపై ఎన్ఐఏ, ఎన్ఎస్జి, సిఐఎస్ఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో మరో మారు డ్రోన్ కలకలం సృష్టించడం పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు నిదర్శనంగా నిలుస్తుంది.
-
భారత్ గెలిస్తే ఏంటట: పాకిస్తానోళ్లు కడుపు మంటతో పోయేట్టున్నారయ్యో -
పాకిస్థాన్ ఖేల్ ఖతం.. లీటర్ పెట్రోల్ రూ. 321, డీజిల్ రూ. 335.. -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..!












Click it and Unblock the Notifications