వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ కు బిగ్ రిలీఫ్ .. 30 వేలకు దిగువనే కొత్త కేసులు, 3 లక్షల దిగువకు యాక్టివ్ కేసులు

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా కేసుల నమోదు కొనసాగుతోంది. క్రమంగా కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం 30 వేలకు దిగువనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. భారత్ లో గత 24 గంటల్లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 26,041 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి . దీంతో ఇప్పటి వరకు భారతదేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,36,78,786 కు పెరిగింది.

ఏపీలో కరోనా : 1,184 కొత్తకేసులు,11 మరణాలతో .. అధికంగా కేసులు ఆ జిల్లాలోనే !!ఏపీలో కరోనా : 1,184 కొత్తకేసులు,11 మరణాలతో .. అధికంగా కేసులు ఆ జిల్లాలోనే !!

 ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,99,620

ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,99,620

గత 24 గంటల్లో దేశంలో 29,621 రికవరీలు నమోదు కాగా, దీంతో మొత్తం దేశంలో ఇప్పటి వరకు కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 3,29,31,972 కి చేరుకుంది. దేశంలో రికవరీ రేటు 78.89 శాతంగా ఉంది. గత 24 గంటల్లో దేశంలో 276 మరణాలు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం మొత్తం మరణాల సంఖ్య 4,47,194 గా నమోదైంది. ఇక ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,99,620 గా ఉన్నాయి. కరోనా యాక్టివ్ కేసులు తగ్గటం కాస్త ఊరటనిస్తుంది. కరోనా యాక్టివ్ కేసులు 0.90 శాతం గా నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా కేరళ రాష్ట్రంలోని 1,63,855 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

 కేరళ రాష్ట్రంలో తాజాగా 15951 కరోనా కేసులు

కేరళ రాష్ట్రంలో తాజాగా 15951 కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటి వరకు దేశంలో గత 24 గంటల్లో 38,18,362 మందికి వ్యాక్సిన్ డోసులను ఇచ్చారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా ఇచ్చిన మొత్తం టీకాల సంఖ్య 86,01,59,011 గా ఉంది. ఇదిలా ఉంటే గడచిన 24 గంటల్లో 11,65,006 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇక తాజాగా కేరళ రాష్ట్రంలో 15951 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి వల్ల తీవ్రంగా దెబ్బతిన్న మహారాష్ట్రలో 3206 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.

 వివిధ రాష్ట్రాలలో గత 24 గంటల్లో నమోడైన్ కొత్త కేసులు ఇలా

వివిధ రాష్ట్రాలలో గత 24 గంటల్లో నమోడైన్ కొత్త కేసులు ఇలా

ఇక తమిళనాడు రాష్ట్రంలో 24 గంటల్లో 1694 కేసులు నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1184 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఉప ఎన్నికల ప్రచారం జరుగుతున్న పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 748 కరోనా కేసులు నమోదు కాగా కర్ణాటకలో 775 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలో 1478 కేసులు నమోదయ్యాయి. ఇక ఒడిశా రాష్ట్రంలో 585 కేసులు, తెలంగాణ రాష్ట్రంలో 170 కరోనా కేసులు నమోదయ్యాయి .దేశ రాజధాని ఢిల్లీలో 29 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో గణనీయంగా కరోనా కంట్రోల్ లోకి వచ్చింది.

Recommended Video

Who Is Sneha Dubey? పాకిస్తాన్ - ఇమ్రాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ UNGA లో చీల్చిచెండాడిన‌ లేడీ సింగం
 పండుగల సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం

పండుగల సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం

ఇక రానున్న రోజులన్నీ పండుగ రోజులని ఈ సమయంలో అందరూ కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలి. మోడీ మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని రక్షిత వలయంలో ఉండేలా చూసుకోవాలని భారత ప్రధాని మోడీ కోరారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రతి ఒక్కరికి కీలక పాత్ర ఉందని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. దసరా, దీపావళి పండుగలు సమీపిస్తున్న నేపథ్యంలో పండుగలు జరుపుకుంటూనే కరోనా నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

English summary
In the last 24 hours, 26,041 new corona cases, 276 deaths were reported in India. This brings the total number of corona cases in India to 3,36,78,786 so far.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X