గురుగ్రామ్ స్కూల్లో ఘోరం: రక్తపు మడుగులో విద్యార్థి
దేశ రాజధాని న్యూఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ ప్రైవేటు పాఠశాలలోని టాయిలెట్లో 2వ తరగతి చదువుతున్న ఏడేళ్ల విద్యార్థి మృతదేహం లభించింది.
గురుగ్రామ్: దేశ రాజధాని న్యూఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ ప్రైవేటు పాఠశాలలోని టాయిలెట్లో 2వ తరగతి చదువుతున్న ఏడేళ్ల విద్యార్థి మృతదేహం లభించింది. రక్తపుమడుగులో ఆ విద్యార్థి మృతదేహం పడి ఉండటం గమనార్హం.
ఈ దారుణ ఘటన స్థానిక ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఏడేళ్ల బాలుడి మృతదేహాన్ని టాయిలెట్లో తోటి విద్యార్థి గుర్తించి పాఠశాల సిబ్బందికి తెలియజేశాడు. బాలుడి గొంతు కత్తితో నరికి ఉండటం గమనార్హం. మృతదేహం పక్కనే కత్తి కూడా లభించింది.

పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఎవరో దారుణంగా హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. గత సంవత్సరం కూడా ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ వసంత్కుంజ్ బ్రాంచ్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకోవడం గమనార్హం. 6ఏళ్ల విద్యార్థి మృతదేహం వాటర్ ట్యాంకులో లభించింది.
Gurugram: Body of a class II student found inside a toilet in Ryan International School, Bhondsi.
— ANI (@ANI) September 8, 2017
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications