మళ్ళీ కరోనాకేసుల బిగ్గెస్ట్ జంప్: 5వేలను దాటిన తాజాకేసులు; ఆ రెండు రాష్ట్రాలలోనే అధికం!!
భారతదేశంలో కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితి కలిగిస్తుంది. స్వల్ప హెచ్చుతగ్గులతో 4,000 సమీపంలో నమోదవుతున్న కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా దేశంలో 5 వేలకు పైబడి కరోనా కేసులు నమోదు అవుతున్న పరిస్థితి నాలుగవ వేవ్ పై ఆందోళనకు కారణంగా మారింది
గత 24 గంటల్లో 5,233 కొత్త కరోనావైరస్ కేసులు
దేశంలో గత 24 గంటల్లో 5,233 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి, రోజువారీ సానుకూలత రేటు 1.67% మరియు వారానికి 1.12%గా నమోదయింది. భారతదేశంలో రోజువారీ కరోనావైరస్ కేసులు 93 రోజుల తర్వాత 5,000 కంటే ఎక్కువ నమోదయ్యాయి. అయితే క్రియాశీల కేసులు 29 వేల వరకు చేరుకోవడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఏడు తాజా మరణాలతో కలిపి దేశవ్యాప్తంగా ప్రస్తుతం మరణాల సంఖ్య 5,24,715కి చేరుకుంది.
పెరిగిన రోజువారీ పాజిటివిటీ రేటు.. ఒకేసారి ఉవ్వెత్తున కేసులు
ఇదిలా ఉంటే మంగళవారం ఒక్కరోజే 3,13,321 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా 5,233 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 1.47 శాతానికి ఎగబాకింది. మునుపటి రోజు నమోదైన కేసులతో పోలిస్తే ఒక్కసారిగా కొత్త కేసులలో 41 శాతం పెరుగుదల కనిపిస్తోంది. అధికంగా కరోనా కేసులు నమోదు చేస్తున్న రాష్ట్రాలుగా మహారాష్ట్ర, కేరళ నిలిచాయి.
మహారాష్ట్ర , కేరళ రాష్ట్రాలలో కరోనా కేసుల పెరుగుదల
మహారాష్ట్రలో గత 24 గంటల్లో 1881 కేసులు, కేరళలో 2271 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కోవిడ్ కేసులు భారీగా పెరిగాయి. భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై మంగళవారం 1,242 కొత్త కరోనావైరస్ ఇన్ఫెక్షన్లను నివేదించింది. ఇది మునుపటి రోజు సంఖ్య కంటే రెట్టింపు కేసులను నమోదు చేసింది. మంగళవారం మహారాష్ట్రలోని మొత్తం కేసుల్లో 90% కేసులు ముంబైతో పాటు, థానే మరియు నవీ ముంబయిలో నమోదయ్యాయి. అయితే, మహమ్మారి సంబంధిత మరణం సంభవించలేదని పౌర సంస్థ బృహన్ముంబై ముంబై కార్పొరేషన్ (BMC) తెలిపింది.
దేశంలో క్రమంగా పెరుగుతున్న యాక్టివ్ కేసులు
నిన్న ఒకరోజు 3345 మంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకోగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 4.26 కోట్లుగా ఉంది. జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.72 శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. రికవరీలు తగ్గడంతో క్రియాశీల కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.
ప్రస్తుతం దేశంలో 28,857 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇన్ఫెక్షన్లలో యాక్టివ్ కేసులు 0.07 శాతం ఉన్నాయి. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,26,36,710కి చేరుకోగా, కేసుల మరణాల రేటు 1.21 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో నిర్వహించబడిన వ్యాక్సిన్ మోతాదుల సంఖ్య 194.43 కోట్లకు మించిపోయింది.