తరుముకొస్తున్న గులాబ్ తుపాన్-ఒడిశాలో భారీ వర్షాలు-ఉత్తరాంధ్రలోనూ-నేవీ అప్రమత్తం
ఏపీ-ఒడిశా రాష్ట్రాలపై గులాబ్ తుపాను ప్రభావం తీవ్రమవుతోంది. ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ ఒడిశా జిల్లాలపై ఇది ప్రభావం చూపుతోంది. ఈ అర్ధరాత్రికి గోపాల్ పూర్-కళింగపట్నం మధ్య గులాబ్ తుపాను తీరం దాటబోతోంది. దీంతో ఇప్పటికే ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో వర్షాలు మొదలయ్యాయి. మరికొన్ని గంటల్లో వర్షాలు తీవ్రరూపం దాల్చబోతున్నాయి. ఇరు రాష్ట్రాల అధికారులు తీర ప్రాంతాల్ని అప్రమత్తం చేస్తున్నారు.
గులాబ్ తుపాను ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలపైనా, ఒడిశాలోని గంజాం, గజపతి జిల్లాలపైనా ప్రభావం చూపుతుందని జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ (ఎన్సీఎమ్సీ) అంచనా వేస్తోంది. గులాబ్ తుపాను ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలతో పోలిస్తే ఒడిశాపైనే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒడిశాలోని చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గులాబ్' తుఫాను నేపథ్యంలో ఒడిశాలోని దక్షిణ, తీరప్రాంతాలలో ఇవాళ ఉదయం నుంచే వర్షాలు ప్రారంభమయ్యాయి, ఇది గత నాలుగు నెలల్లో రాష్ట్రంలో రెండో తుపాను. ప్రస్తుతం ఇది గోపాల్పూర్కు తూర్పు ఆగ్నేయంగా 140 కిమీ, కళింగపట్నానికి తూర్పు-ఈశాన్యంలో 190 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావారణ శాఖ వెల్లడించింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను 'గులాబ్' అర్ధరాత్రి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం మధ్య తీరాన్ని తాకుతుందని భావిస్తున్నందున, భారత నావికాదళం తుఫాను కదలికను నిశితంగా పరిశీలిస్తోంది. ప్రధాన కార్యాలయం, తూర్పు నౌకాదళం, ఒడిశా ప్రాంతంలోని నేవల్ ఆఫీసర్స్-ఇన్-ఛార్జ్ తుఫాను ప్రభావాలను ఎదుర్కోవడానికి సన్నాహక కార్యకలాపాలను నిర్వహించాయి. తుపాను నేపథ్యంలో ఏపీ, ఒడిశా ప్రభుత్వాలకు సాయం చేసేందుకు అధికారులతో నేవీ వర్గాలు టచ్ లో ఉన్నాయి. అటు ప్రధాని మోడీ కూడా ఏపీ, ఒడిశా సీఎంలు జగన్, నవీన్ పట్నాయక్ తో ఫోన్లో మాట్లాడారు. అవసరమైన సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

గులాబ్ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సోమవారం ఉదయం వరకు ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, యానాంలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం వరకు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ మరియు యానాం తీరంలోని చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
-
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
అతడు ఇప్పుడు పక్కా మెంటల్లీ టఫ్: రవిశాస్త్రి -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
భారత్ కు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్.. -
ఫైనల్ వేళ టీమిండియాకు మాజీ కోచ్ హెచ్చరిక, అభిషేక్ బ్యాటింగ్ ఆర్డర్ ఇక..!! -
మీ పాత బంగారం చెల్లుతుందా? 2026 కొత్త నిబంధనలు ఇవే! -
EPF 2026 అమల్లోకి: డబ్బులు ఎన్నిసార్లు తీసుకోవచ్చో తెలుసా? -
T20 world cup Final: ఫైనల్ అభిషేక్ దే-తేల్చేసిన టీమిండియా హీరో..! -
ఇరాన్ పోరాటం వెనుక రహస్య ఆయుధం? యూఎస్-ఇజ్రాయెల్ కు చిక్కని సీక్రెట్..!












Click it and Unblock the Notifications