నోట్ల రద్దు, అసలు విషయం చెప్పిన మోడీ!: మన్ కీ బాత్లో ఏమన్నారంటే..
ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాడు 26వ మన్ కీ బాత్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఓ విషయాన్ని బయటపెట్టారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాడు 26వ మన్ కీ బాత్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఓ విషయాన్ని బయటపెట్టారు. నోట్ల రద్దుతో నల్లధనం కలిగి ఉన్న వారిని టార్గెట్ చేయడంతో పాటు క్యాష్ లెస్ వైపు దేశాన్ని నడిపించాలనే అభిప్రాయం మోడీ మాటల ద్వారా వెల్లడయింది.
ఆయన ఆదివారం మన్ కీ బాత్లో మాట్లాడారు. కెన్యాలో ఎం-పెసా విధానాన్ని ప్రవేశ పెట్టిన అంశాన్ని ప్రధాని మోడీ గుర్తు చేశారు. వొడాఫోన్ 2007లో కెన్యాలో ఈ విధానాన్ని ప్రవేశ పెట్టింది. మొబైల్ ఫోన్ ద్వారా నగదు రహిత లావాదేవీలు జరపడమే దీని ఉద్దేశ్యం. దీనినే మన పరిభాషలో క్యాష్ లెస్ విధానం అంటాం. క్యాష్ లెస్ విధానం అమలయితే నల్ల ధనాన్ని నియంత్రించగలమని ప్రధాని మోడీ విశ్వసిస్తున్నారు.

మన్ కీ బాత్లో మోడీ ఏమన్నారంటే..
డెబ్బై ఏళ్లుగా ఏళ్లుగా దేశాన్ని పట్టి పీడిస్తున్న నల్లధనం అనే వ్యాధికి చికిత్స చేసేందుకు కొంత సమయం పడుతుందని, అప్పటి వరకు అందరూ ఓపిక పట్టాలన్నారు. నల్లధనంపై తీసుకున్న నిర్ణయం పెద్ద అడుగు, దీని వల్ల మొదటి 50 రోజులు కొంత ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని తాను ముందే చెప్పానన్నారు.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ప్రజలందరూ అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బ్యాంకులు, తపాలా కార్యాలయ ఉద్యోగులు ఎంతో శ్రమించారని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తమ విధులు ఎంతో శ్రద్ధగా నిర్వర్తించారన్నారు.
ఈ ఏడాది దీపావళి ఎంతో విభిన్నంగా ఉందని, ప్రతి ఒక్కరూ తమ సందేశాలను దేశజవాన్లకు పంపించడం అద్భుతం అన్నారు. సరిహద్దులో ఈ ఏడాది ఒంటరిగా దీపావళి చేసుకున్నామన్న భావన మాకు కలగలేదని ఒక జవాను లేఖ రాశారని చెప్పారు.
నగదు కొరత వల్ల కొన్ని రెస్టారెంట్లు ఉచితంగా ఆహార పదార్థాలను అందిస్తున్నట్లు తెలిసిందని, వారికి నా అభినందనలు అన్నారు. నోట్ల రద్దు వల్ల సూరత్కు చెందిన ఓ జంట కేవలం రూ.500తో వివాహం చేసుకోవడాన్ని మోడీ అభినందించారు. వివాహ వేడుక సందర్భంగా తేనీరు పంచడంపై ప్రశంసించారు.
ప్రతి ఒక్కరూ పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, నగదు రహిత లావాదేవీలు చేసేందుకు అనేక సురక్షిత మార్గాలు ఉన్నాయని, దీనిని చిన్న తరహా వ్యాపారులు ఉపయోగించుకోవాలన్నారు. రోజువారీ కూలీలందరూ బ్యాంకు ఖాతాలను తెరవాలన్నారు.
నగదు రహిత సమాజంగా మారడమే తన కల అన్నారు. దేశంలోని పేద, రైతులు, కార్మికులకు బాధలు దూరం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. నల్లధనాన్ని దాచుకునేందుకు పేద ప్రజల బ్యాంకు ఖాతాలను దయచేసి ఎవరూ ఉపయోగించవద్దన్నారు.
ఫోన్లు ఉపయోగించండి: మోడీ
ఈ-బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్లను వినియోగించుకోవాల్సిన సమయం వచ్చేసిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. నోట్ల రద్దు వల్ల ఇబ్బందులు కలుగుతుండటంతో ఇక నుంచి ప్రజలు డిజిటల్ బ్యాంకింగ్ మార్గాలను వినియోగించుకోవడం మొదలుపెట్టాలని ట్వీట్ చేశారు.
-
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు












Click it and Unblock the Notifications