ఓటు నమోదు అవగాహన కోసం.. ఫేస్బుక్తో చేతులు కలిపిన ఎలక్షన్ కమిషన్
ఓటు హక్కు నమోదు గురించి యువతలో అవగాహన పెంపొందించడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.
న్యూఢిల్లీ: ఓటు హక్కు నమోదు గురించి యువతలో అవగాహన పెంపొందించడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.
దీంతో యువత ఎక్కువ సమయం గడిపే ఫేస్బుక్ ద్వారా ఓటు హక్కు నమోదు ప్రక్రియను వేగవంతం చేసే అవకాశం కలగనుంది. ఒప్పందంలో భాగంగా 18 ఏళ్లు నిండిన యువతకు పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు ఓటు నమోదు చేసుకోవాలనే మెసేజ్ వెళ్తుంది.

ఆ మెసేజ్ మీద క్లిక్ చేయగానే ఓటర్స్ సర్వీసెస్ పోర్టల్కు అనుసంధానం అవుతుంది. అక్కడ వివరాలు నమోదు చేస్తే ఒక్క క్లిక్తో ఓటు హక్కు నమోదు ప్రక్రియ పూర్తవుతుంది.
ఎన్నికల సంఘం ఈ మెసేజ్ను తెలుగు, హిందీ, ఇంగ్లిష్తోపాటు మొత్తం 13 భాషల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఏడాది ఇప్పటికే 18 ఏళ్లు పూర్తి చేసుకున్న, పైబడిన వారందరికి ఈనెల 30న ఫేస్బుక్ ద్వారా ఈ సందేశం వెళ్లనుంది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications