ఓటు నమోదు అవగాహన కోసం.. ఫేస్బుక్తో చేతులు కలిపిన ఎలక్షన్ కమిషన్
ఓటు హక్కు నమోదు గురించి యువతలో అవగాహన పెంపొందించడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.
న్యూఢిల్లీ: ఓటు హక్కు నమోదు గురించి యువతలో అవగాహన పెంపొందించడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.
దీంతో యువత ఎక్కువ సమయం గడిపే ఫేస్బుక్ ద్వారా ఓటు హక్కు నమోదు ప్రక్రియను వేగవంతం చేసే అవకాశం కలగనుంది. ఒప్పందంలో భాగంగా 18 ఏళ్లు నిండిన యువతకు పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు ఓటు నమోదు చేసుకోవాలనే మెసేజ్ వెళ్తుంది.
ఆ మెసేజ్ మీద క్లిక్ చేయగానే ఓటర్స్ సర్వీసెస్ పోర్టల్కు అనుసంధానం అవుతుంది. అక్కడ వివరాలు నమోదు చేస్తే ఒక్క క్లిక్తో ఓటు హక్కు నమోదు ప్రక్రియ పూర్తవుతుంది.
ఎన్నికల సంఘం ఈ మెసేజ్ను తెలుగు, హిందీ, ఇంగ్లిష్తోపాటు మొత్తం 13 భాషల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఏడాది ఇప్పటికే 18 ఏళ్లు పూర్తి చేసుకున్న, పైబడిన వారందరికి ఈనెల 30న ఫేస్బుక్ ద్వారా ఈ సందేశం వెళ్లనుంది.