అసమ్మతి: పూర్తి మంత్రి వర్గం లేదు, సీఎం కుమారస్వామి, జేడీఎస్ దారిలో కాంగ్రెస్, టైం ఫిక్స్ !
బెంగళూరు: కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం మంత్రి వర్గం విస్తరణకు రంగం సిద్దం అయ్యింది. అయితే కర్ణాటకలో పూర్తి మంత్రి వర్గం విస్తరణ ఇప్పట్లో ఉండదని మంగళవారం కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అన్నారు. అసమ్మతి నేతలకు భయపడి పూర్తి మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్,జేడీఎస్ నాయకులు వెనకడుగు వేస్తున్నారని సమాచారం.
Recommended Video


సీఎం వివరణ
బుధవారం మద్యాహ్నం 2 గంటలకు జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చెయ్యడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మొత్తం 34 మంత్రులు బుధవారం ప్రమాణస్వీకారం చెయ్యడం లేదని సీఎం కుమారస్వామి మంగళవారం మీడియాకు చెప్పారు.

కాంగ్రెస్, జేడీఎస్
కర్ణాటక-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి పదవులు పంపకం పూర్తి అయ్యింది. కాంగ్రెస్ కు 22 మంత్రి పదవులు, జేడీఎస్ 12 మంత్రి పదవులు తీసుకుంటున్నాయి. జేడీఎస్ బీఎస్పీ శాసన సభ్యుడు ఎన్. మహేష్ కు మంత్రి పదవి ఇస్తుండటంతో ఆ పార్టీకి కేవలం 11 మంత్రి పదవులు దక్కుతున్నాయి.

సీఎం గ్యాంగులో 8 మంది
బుధవారం మద్యాహ్నం 2 గంటలకు జేడీఎస్ కు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తున్నారని ముఖ్యమంత్రి కుమారస్వామి మీడియాకు చెప్పారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల కారణంగా మిగిలిన మూడు మంత్రి పదవులు ఎవ్వరికీ ఇవ్వడం లేదని, తరువాత కేటాయిస్తామని సీఎం కుమారస్వామి అన్నారు.

జేడీఎస్ దారిలో కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ సైతం 22 మంత్రి పదవులు ఇప్పుడే కేటాయించే అవకాశం లేదని సమాచారం. జేడీఎస్ దారిలోనే కొన్ని మంత్రి పదవులు కేటాయించి మిగిలిన మంత్రి పదవులు ఖాళీగా పెట్టి తరువాత కేటాయించాలని నిర్ణయించారని తెలిసింది.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications