వారిని దెయ్యాలే చంపాయ్: హోంమంత్రి షాకింగ్ కామెంట్స్
భోపాల్: మధ్యప్రదేశ్ హోంమంత్రి భూపేంద్ర సింగ్ తన వాఖ్యలతో అందరినీ దిగ్భ్రాంతికి గురి చేశారు. రాష్ట్రంలో నమోదవుతోన్న మరణాలపై అధికారంలో భారతీయ జనతా పార్టీని సమాధానం చెప్పాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ శాసనసభలో డిమాండ్ చేసింది.
అయితే, దానిపై స్పందించిన ఆ రాష్ట్ర హోం మంత్రి భూపేంద్రసింగ్.. మధ్యప్రదేశ్లో గత రెండున్నరేళ్లలో 400 మంది మృతి చెందారని, వారిలో కొందరిని దెయ్యాలు చంపాయని ఆయన అధికారికంగా ప్రకటన చేశారు.
ఒక హోంమంత్రి ఈ ప్రకటన చేయడంతో విన్న వారికి దిమ్మదిరిగిపోయింది. దీనిపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే శైలేంద్ర పటేల్ స్పందిస్తూ.. హోం మంత్రి ప్రకటన తనను ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు. కొందరి చావులకి కారణం చేతబడి, దెయ్యాలే కారణమని సాక్షాత్తు హోంమంత్రే ప్రకటన చేయడం హాస్యాస్పదమని ఆయన అన్నారు.

హోం మంత్రి ఈ ప్రకటన చేసిన తర్వాత తాము ప్రభుత్వం మూఢనమ్మకాలను విశ్వసిస్తుందా? అని ప్రశ్నించామని, దీనికి మంత్రి నుంచి సమాధానం రాలేదని ఆయన చెప్పారు.
ఈ ప్రకటన చేసిన అనంతరం భూపేంద్రసింగ్ శాసనసభ బయట మీడియాతో మాట్లాడుతూ.. తమ కుటుంబసభ్యులు దెయ్యాల వల్లే చనిపోయారని చనిపోయిన వ్యక్తుల కుటుంబసభ్యులు చెప్పారని తెలిపారు. అదే విషయాన్ని తాము ప్రకటించామని బదులిచ్చారు. అయితే తమ ప్రభుత్వం ఇటువంటి వాటిని విశ్వసించబోదని ఆయన అన్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications