రోడ్డు ప్రమాదంలో ఇన్స్పెక్టర్ ఇలా, మానవత్వాన్ని మంటగలిపారు
రోడ్డు ప్రమాదంలో ప్రాణాపాయస్థితిలో ఉన్న ఓ ఇన్స్ పెక్టర్ ను ఆసుపత్రికి తరలించకుండా,ప్రమాదం జరిగిన తీరుపై ఫోటోలు తీసుకొంటూ చోద్యం చూశారు స్థానికులు.అయితే ఆసుపత్రికి పోలీసులే వచ్చి తరలించారు.
మైసూర్:మాయమైపోతున్నాడమ్మా, మనిషన్నవాడు ..మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు అంటూ అందెశ్రీ పాట రాశాడు. ఈ పాట అచ్చంగా బెంగుళూరులో జరిగిన ఘటనకు సరిపోతోంది. ప్రాణాపాయంలో ఉన్న ఓ పోలీసులకు సహయం చేయాల్సిందిపోయి ఫోటోలు దింపుతూ చోద్యం చూశారు స్థానికులు.
కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసు జీపు, బస్సు ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో జీపు డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు.
జీపులో ప్రయాణిస్తోన్న ఇన్స్ పెక్టర్ మహేష్ కుమార్ తీవ్ర గాయాలపాలయ్యాడు. కొన ఊపిరితో రోడ్డుపై పడి ఉన్నాడు.అయితే మహేష్ కుమార్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.

అయితే ఎంతో మంది అతణ్ణి చూస్తూనే ఉండిపోయారు. స్థానికులు గుంపులుగా నిలబడి ఫోటోలు తీస్తూ చోద్యం చూశారు.కనీసం ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహేష్ కుమార్ ను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించలేదు.
స్థానిక పోలీసులకు సమాచారం అందింది, వారు వచ్చి మహేష్ కుమార్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్టుగా పోటీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలించకుండా ఇబ్బందిపెట్టకూడదని సుప్రీంకోర్టు ఆదేశించినా మార్పు రాలేదు. ఫోటోలు తీసేందుకు తీసుకొన్న సమయం ఆసుపత్రికి తరలించేందకు కేటాయిస్తే ఓ నిండు ప్రాణం దక్కేది.
-
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు












Click it and Unblock the Notifications