రూ.200 నోట్లు ఎటిఎంలలో రావాలంటే మరో 3 నెలలు
న్యూఢిల్లీ:ఎటిఎం నుండి రూ.200 కొత్త నోటు ప్రజలకు అందుబాటులోకి రావాలంటే ఇంకా మూడు మాసాల సమయం పట్టే అవకాశం ఉంది. ఎటీఎంలను రీక్యాలిబరేట్ చేసిన తర్వాతే రూ. 200 నోట్లను ఎటిఎంలలో ఉంచనున్నారు.
ఆర్బిఐ ఇటీవలనే కొత్తగా రూ.200 నోటును విడుదల చేసింది. కొత్త నోట్ల జారీకి అనుగుణంగా మెషీన్లను సర్దుబాటు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే కొన్ని బ్యాంకులు ఎటీఎంలను రీక్యాలిబరేట్ చేశాయి.

అయితే ఎటిఎంలను రీక్యాలిబరేట్ చేయని మిషన్లను వెంటనే చేయాలని బ్యాంకులు ఆయా సంస్థలను కోరాయి. మరోవైపు రూ.200 నోట్ల సరఫరాను త్వరలో పెంచనున్నట్టు ఆర్బిఐ ప్రకటించింది. ఎప్పటి నుండి రూ.200 నోట్లను ఎక్కువగా సరఫరాచేస్తారోననే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు.
కొత్త నోటు జారీకి తగినట్టుగా దేశ వ్యాప్తంగా 2.25 లక్షల ఎటీఎంల్లో మార్పులుచేస్తారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఆర్బిఐ నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే ఎటిఎంలను రీక్యాలిబరేట్ చేయనున్నట్టు ఎటిఎం నిర్వాహకులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా 60వేల ఎటిఎంలను నిర్వహిస్తున్న ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ లిమిటెడ్ సీఎండి రవి చెప్పారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications