రూ.200 నోట్లు ఎటిఎంలలో రావాలంటే మరో 3 నెలలు
న్యూఢిల్లీ:ఎటిఎం నుండి రూ.200 కొత్త నోటు ప్రజలకు అందుబాటులోకి రావాలంటే ఇంకా మూడు మాసాల సమయం పట్టే అవకాశం ఉంది. ఎటీఎంలను రీక్యాలిబరేట్ చేసిన తర్వాతే రూ. 200 నోట్లను ఎటిఎంలలో ఉంచనున్నారు.
ఆర్బిఐ ఇటీవలనే కొత్తగా రూ.200 నోటును విడుదల చేసింది. కొత్త నోట్ల జారీకి అనుగుణంగా మెషీన్లను సర్దుబాటు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే కొన్ని బ్యాంకులు ఎటీఎంలను రీక్యాలిబరేట్ చేశాయి.

అయితే ఎటిఎంలను రీక్యాలిబరేట్ చేయని మిషన్లను వెంటనే చేయాలని బ్యాంకులు ఆయా సంస్థలను కోరాయి. మరోవైపు రూ.200 నోట్ల సరఫరాను త్వరలో పెంచనున్నట్టు ఆర్బిఐ ప్రకటించింది. ఎప్పటి నుండి రూ.200 నోట్లను ఎక్కువగా సరఫరాచేస్తారోననే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు.
కొత్త నోటు జారీకి తగినట్టుగా దేశ వ్యాప్తంగా 2.25 లక్షల ఎటీఎంల్లో మార్పులుచేస్తారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఆర్బిఐ నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే ఎటిఎంలను రీక్యాలిబరేట్ చేయనున్నట్టు ఎటిఎం నిర్వాహకులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా 60వేల ఎటిఎంలను నిర్వహిస్తున్న ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ లిమిటెడ్ సీఎండి రవి చెప్పారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications