వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.200 నోటు విడుదల: దోరగా వేయించిన దోశంటూ నెటిజన్లు...

రూ.200 కొత్త నోటును ఆర్‌బిఐ ప్రవేశపెట్టింది.ఈ నోటు కోసం ఆర్‌బిఐ వద్ద క్యూలు కట్టారు.కొత్త నోటుపై సోషల్‌మీడియాలో నెటిజన్లు విపరీతంగా స్పందించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆర్‌బిఐ రూ.200 డినామినేషన్ కరెన్సీని శుక్రవారం నాడు ప్రవేశపెట్టింది. కొత్త రూ. 200 రూపాయాల నోటు కోసం రిజర్వ్‌బ్యాంకుల వద్ద కస్టమర్లు పెద్ద ఎత్తున క్యూ కట్టారు.

దేశ రాజధానిలోని కొత్త నోట్ల కోలాహలం నెలకొంది. కొత్త నోట్లు చేజిక్కించుకునేందుకు పోటీ పడ్డారు. రూ.50, రూ.200 నోట్ల కోసం ఎగబడ్డారు. రిజర్వ్ బ్యాంకు శుక్రవారంనాడు కొన్ని ఎంపిక చేసిన ఆర్‌బీఐ శాఖలు, బ్యాంకుల ద్వారా రూ.200 నోట్లను మార్కెట్లోకి విడుదల చేసింది.

It's Official. Bright Yellow Rs. 200 Notes From Today: 10 Features

రూ.200 రూపాయల డినామినేషన్ కరెన్సీ నోట్లను ఆర్బీఐ ప్రవేశపెట్టడం దేశంలోనే ఇది తొలిసారి. అయితే కొత్త నోట్లు ఏటీఎంల ద్వారా చలామణిలోకి రావడానికి మరికొంత సమయం పడుతుంది.

ధోరగా వేయించిన దోశ మాదిరిగా
కొత్త రూ. 200 నోటుపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేశారు. నోటు రంగు మీదే చాలా మంది నెటిజ‌న్లు కామెంట్లు కురిపిస్తున్నారు. కాషాయ రంగులో ఉన్న ఈ నోటు దోర‌గా వేయించిన దోశ‌ను త‌ల‌పిస్తుంద‌ని, బాగా మ‌ర‌గ‌బెట్టిన ఇరానీ చాయ్ రంగులో ఉంద‌ని సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

నోటును వినాయ‌క చ‌వితి రోజు విడుద‌ల చేయ‌డాన్ని ప్ర‌స్తావిస్తూ ఇక్క‌డ కూడా మోదీ ప్ర‌భుత్వం హిందుత్వాన్ని చూపిస్తుంద‌ని విమ‌ర్శిస్తున్నారు. ఇప్ప‌టికి వ‌ర‌కు విడుద‌ల చేసిన రూ. 2000, రూ. 500, రూ. 200, రూ. 50 నోట్ల‌న్నీ అమ్మాయిల‌కు బాగా ఇష్ట‌మైన రంగుల్లోనే ఉన్నాయ‌న్నారు. మ‌రి అబ్బాయిల‌కోసం నోట్లు ప్ర‌చురించ‌రా? అని మ‌రికొంత మంది ప్ర‌శ్నిస్తున్నారు. ఇటీవ‌లే మార్కెట్‌లో ప‌ప్పు ధ‌ర రూ. 200 దాటింద‌ని, అందుకే రూ. 200 నోటును ప‌ప్పు రంగులో ముద్రించార‌ని నెటిజ‌న్లు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

English summary
New Rs. 200 notes will be launched today, the Reserve Bank of India (RBI) announced today in a press release days after introducing new fluorescent blue Rs. 50 banknotes. This is the fourth new note to be announced since November, when Prime Minister Narendra Modi announced an overnight ban on Rs. 1,000 and Rs. 500 notes to choke tax evaders. The government says the Rs. 200 notes will inject more low denomination currency in the system.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X