Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నలుగురు జడ్జీల తిరుగుబాటు: ఎక్కడ వేసిన గొంగళి అక్కడే

న్యూఢిల్లీ: నలుగురు సీనియర్ న్యాయమూర్తుల ప్రెస్‌మీట్‌తో తలెత్తిన వివాదం కొలిక్కి వచ్చినట్లు లేదు. న్యాయవ్యవస్థలో తలెత్తిన వివాదం సమసిపోయినట్లు కనిపించడం లేదని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ మంగళవారంనాడు అన్నారు.

Recommended Video

    చరిత్రలో తొలిసారి 4గురు జడ్జిల ప్రెస్‌మీట్..!

    సమస్య రెండు మూడు రోజుల్లో పరిష్కారమవుతుందని ఆయన ఆశించారు. సమస్యను పరిష్కరించే పనిలో తాము ఉన్నామని, త్వరలో పరిష్కారమవుతుందని ఆయన అన్నారు. ఈ వారాంతంలోగా సమస్య పరిష్కారమవుతుందని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ కూడా అన్నారు.

    Judicial crisis not resolved yet, confirms Attorney General

    కీలకమైన కేసులను విచారించే ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో నలుగురు సీనియర్ న్యాయమూర్తులను ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా వేయకపోవడంపై వివాదం మరింత ముదిరినట్లు కనిపిస్తోంది.

    కేసుల కేటాయింపులో పారదర్శకత లేదని, ఇందులో వివక్ష ప్రదర్సిస్తున్నారని నలుగురు సీనియర్ న్యాయమూర్తులు ఈ నెల 12వ తేదీన ప్రెస్ మీట్ పెట్టి విమర్శించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వివాదం కొనసాగుతోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+