డీకే శివకుమార్ vs సిద్ధరామయ్య: ఎవరి బలమెంత?
DK Shivakumar vs Siddaramaiah: కర్ణాటక కాంగ్రెస్లో రాజకీయ పోరు కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కుర్చీ కోసం జరుగుతున్న పోరాటం ఆగేలా కనిపించడం లేదు. డీకే శివకుమార్, సిద్ధరామయ్య వర్గాలు తమ తమ వాదనలను వినిపిస్తున్నాయి. అధిష్ఠానం చెప్పిందే తమకు అంగీకారమని ఇద్దరు నాయకులు కూడా చెప్పారు. అయితే ఈ రెండు వర్గాలలో ఎవరి బలం ఎక్కువ అనే దానిపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి.
ఆయన వైపే మొగ్గు చూపుతున్న సీఎం సీటు
ప్రస్తుతానికి సీఎం సిద్ధరామయ్య పదవికి ఎలాంటి ముప్పు లేదని తెలుస్తోంది. కర్ణాటక రాష్టంలో ఓబీసీలదే రాజ్యమని కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలుసని నివేదికలు చెబుతున్నాయి ఆయనకు అహింద వర్గంతో పాటు పార్టీలోని 100 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కాంగ్రెస్ పార్టీకి సభలో మొత్తం 137 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ క్రమంలో సిద్ధరామయ్య అంగీకారం లేకుండా ముఖ్యమంత్రిని మార్చడం అనేది చాలా కష్టం.

కాంగ్రెస్కు హెచ్చరిక
కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల సమాఖ్య (KSFBCC) కాంగ్రెస్ను హెచ్చరించింది. రాష్ట్ర యూనిట్లో అంతర్గత కలహాల నేపథ్యంలో సిద్ధరామయ్యను సీఎం పదవి నుంచి తొలగించడానికి ఏ ప్రయత్నం చేసినా అది పార్టీపై ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. మరోవైపు కర్ణాటక రాష్ట్ర వొక్కలిగ సంఘం కూడా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న ఉపముఖ్యమంత్రి డి.కె. శివకుమార్కు అన్యాయం జరిగితే.. వారు దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తారని హెచ్చరించింది.
జి.పరమేశ్వర్ పేరును ముందుకు తెచ్చే అవకాశం
ముఖ్యమంత్రిని మార్చాలని సిద్ధరామయ్య వర్గంపై ఒత్తిడి తెస్తే వారు అధిష్ఠానానికి పేర్ల జాబితాను సమర్పిస్తారని గత కొద్ది రోజులుగా మీడియా నివేదికలలో వెల్లడైంది. ఇందులో ఓ ప్రత్యామ్నాయంగా హోంమంత్రి జి.పరమేశ్వర్ పేరు ఉండవచ్చు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. సిద్ధరామయ్య వర్గం ఏ పరిస్థితులలోనూ డీకే శివకుమార్ను తమ బాస్గా అంగీకరించడానికి సిద్ధంగా లేదు.
వొక్కలిగ మఠం నుంచి డీకే శివకుమార్ను సీఎం చేయాలనే డిమాండ్
వీటన్నింటి మధ్య వొక్కలిగ వర్గానికి చెందిన ప్రముఖ మఠం ఆదిచుంచనగిరి మఠం రంగంలోకి దిగింది. ఆదిచుంచనగిరి మఠం ప్రధాన పూజారి నిర్మలానంద నాథ స్వామి మాట్లాడుతూ.. డీకే శివకుమార్ను ముఖ్యమంత్రి చేయాలని అన్నారు. రాష్ట్ర అత్యున్నత పదవిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ నాయకత్వానికి ఆయన అల్టిమేటం కూడా ఇచ్చారు. టీవీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను తాను నిరంతరం చూస్తున్నానని ఆయన అన్నారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications