అక్కినేని మృతిపై మోడీ: చూడాలని... మురళీమోహన్
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలుగు సినీ నటుడు అక్కినేని నాగేశ్వర రావు మృతి పట్ల గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి బుధవారం తన సంతాపాన్ని తెలిపారు. అక్కినేని భారతీయ సినీ రంగ దిగ్గజం అన్నారు. సినీ పరిశ్రమకు ఆయన ఎనలేని సేవ చేశారన్నారు. భారతీయ సినిమా గొప్ప నటుడిని కోల్పోయిందన్నారు. మోడీ ట్విట్టర్లో సంతాపం తెలిపారు.
అక్కినేనిని కలిశా: మనీష్ తివారి
తాను అక్కినేనిని గత ఏడాది జనవరిలో కలిశానని, అది తనకు స్ఫూర్తిదాయక ఎక్స్పీరియన్స్ అని కాంగ్రెసు సీనియర్ నేత మనీష్ తివారి అన్నారు. పరిశ్రమకు అతని మృతి చాలా లోటు అన్నారు.
షాక్: మోహన్ బాబు
తాము షాక్కు గురయ్యామని మోహన్ బాబు అన్నారు.
దురదృష్టకరం: నవీన్ జిందాల్
అక్కినేని మృతి దురదృష్టకరమని నవీన్ జిందాల్ అన్నారు.
చూడలేకపోయా: మురళీ మోహన్
అక్కినేనిని తాను చివరిసారిగా చూడలేకపోయానని, ఆయనతో మాట్లాడలేకపోయానని నటుడు, టిడిపి నేత మురళీ మోహన్ అన్నారు. అక్కినేనికి అనారోగ్యంగా ఉండటంతో వారం క్రితం కలవాలనుకున్నానని కానీ, కుదరలేదన్నారు. ఈ లోపే ఇలా జరగడం జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు. కుటుంబ పెద్దను కోల్పోయినట్లుగా ఉందన్నారు. అక్కినేని మృతికి తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి తన సంతాపాన్ని తెలియజేసింది.