వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నమో టీవీపై రాజకీయ దుమారం లైసెన్సు ఇవ్వలేదన్న సమాచార ప్రసార శాఖ

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్‌కు కొన్ని రోజుల ముందు నమోటీవీ పేరుతో కొత్త ఛానల్ ప్రారంభం కావడం రాజకీయ దుమారం రేపింది. ప్రధాని నరేంద్రమోడీ ఫొటోతో లోగో ఉన్న ఛానెల్ బీజేపీ ప్రచారాన్ని ప్రసారం చేస్తుండటంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. లైసెన్సుల సమాచారం, కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లోపేరు లేకపోవడం, రేటింగ్ ఏజెన్సీ బార్క్ వద్ద కూడా వివరాలు లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఈసీకి లేఖ రాశాయి.

<strong>అనుచిత వ్యాఖ్యలు: యూపీ సీఎం యోగీపై ఈసీకి మాజీ నేవీ ఛీఫ్ ఫిర్యాదు</strong>అనుచిత వ్యాఖ్యలు: యూపీ సీఎం యోగీపై ఈసీకి మాజీ నేవీ ఛీఫ్ ఫిర్యాదు

కాంగ్రెస్, ఆప్ ఫిర్యాదు నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నమో టీవీపై ప్రత్యేక దృష్టి సారించింది. నమో టీవీకి సంబంధించి పూర్తి వివరాలు కోరుతూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు ఎలక్షన్ కమిషన్ లేఖ రాసింది. పనిలో పనిగా నమోటీవీ నుంచి కూడా వివరణ కోరింది.

Namo TV not a licensed TV channel

మరోవైపు మార్చి 31న ప్రధాని నరేంద్రమోడీ మై బీ చౌకీదార్ కార్యక్రమాన్ని గంటకుపైగా ప్రసారం చేసిన దూరదర్శన్‌ నుంచి ఎన్నికల సంఘం వివరణ కోరింది. ఇదిలా ఉంటే నమో టీవీకి సంబంధించి ఈసీ నోటీసులపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ స్పందించింది. నమో టీవీకి ఎలాంటి లైసెన్స్ జారీ చేయలేదని స్పష్టం చేసింది.

English summary
The Election Commission of India has written to the information and broadcasting ministry, seeking a report on the sudden launch of NaMo TV, just days ahead of the Lok Sabha elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X