చరిత్ర: తవ్వకాల్లో బయటపడ్డ టిప్పు సుల్తాన్ కాలంనాటి రాకెట్లు
కర్నాటక: 18వ శతాబ్దపు రాజు టిప్పుసుల్తాన్కు సంబంధించిన వెయ్యికి పైగా రాకెట్లను కర్నాటకలో కనుగొన్నారు పురావస్తుశాఖ అధికారులు. షిమోగా జిల్లాలోని ఓ పాడుబడ్డ బావిలో ఈ రాకెట్లు దొరికాయి. వీటిని యుద్ధ సమయంలో వినియోగించేందుకు దాచి ఉంచినట్లు పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. అయితే వీటిని చూసిన అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అత్యంత బలమైన నాయకుడిగా పేరుగాంచిన టిప్పుసుల్తాన్ 1799లో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పై జరిగిన నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో వీరమరణం పొందాడు. అప్పడే టిప్పుసుల్తాన్ స్వదేశీ పరిజ్ఞానంతో రాకెట్లను అభివృద్ధి చేసినట్లు చరిత్రకారులు చెబుతారు. ఈ రాకెట్లను మైసూరు రాకెట్లు అని పిలిచేవారు. ఈ తరహా రాకెట్లనే బ్రిటీషు వారు నెపోలియనిక్ యుద్ధాల్లో వినియోగించినట్లు తెలుస్తోంది.

బావిని తొవ్వుతున్న సమయంలో ఓ రకమైన వాసన వచ్చిందని అదేంటో కనుగొందామని మరింత లోపలికి తొవ్వగా ఈ రాకెట్లు బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. వీటన్నిటినీ తవ్వి తీసేందుకు మూడురోజులు సమయం పట్టిందని తెలిపిన అధికారులు మొత్తం 15 మంది సభ్యుల బృందం ఈ ఆపరేషన్లో పాల్గొని రాకెట్లను, పేలుడు సామగ్రిని వెలికి తీసినట్లు చెప్పారు. రాకెట్ల పొడవు 23 నుంచి 26 సెంటీమీటర్లున్నాయని చెప్పిన అధికారులు ప్రజల సందర్శనకోసం షిమోగాలోని మ్యూజియంలో ఉంచుతామని చెప్పారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications