షాక్: పాస్పోర్ట్లు ఇక అడ్రస్ ఫ్రూప్ కోసం పనికిరావు, రంగు మారింది
న్యూఢిల్లీ: పాస్ పోర్టులు ఇక అడ్రస్ ప్రూప్గా పనికిరావు. పాస్ పోర్టులో చివరి పేజీలో చిరునామా వివరాలను పొందుపర్చకుండా ఖాళీగా వదిలేయాలని కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకొంది. అయితే ఈ విషయమై విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.
కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ పాస్పోర్టుల జారీ విషయంలో కొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై పాస్పోర్టు చివరి పేజీలో చిరునామా వివరాలను పొందుపరచకుండా ఖాళీగా వదిలేయాలని నిర్ణయించింది. అది అమలులోకి వస్తే గనుక పాస్పోర్టులు ఇక అడ్రస్ ప్రూఫ్లుగా పనికి రావు.

త్వరలో ఈ నిర్ణయం అమలు చేయబోతున్నట్లు ఎంఏఈ అధికారి సురేంద్ర కుమార్ మీడియాకు చెప్పారు. ఇక నుండి జారీ చేసే పాస్పోర్టుల నుంచే ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. పాతవి గడువు ముగిసేవరకు వినియోగించుకోవచ్చని ఆయన ప్రకటించారు.
రెన్యువల్ సమయంలో వాటికి ఈ మార్పులు వర్తిస్తాయని ఆయన వెల్లడించారు. పాస్పోర్టు విధానంలో మార్పులు రాబోతున్నాయన్న విషయాన్ని పుణే ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి జేడీ వైశంపయన్ కూడా దృవీకరించారు.
ప్రస్తుతం పాస్పోర్టు మొదటి పేజీలో ఫోటోతో కూడిన వివరాలుంటాయి. కానీ, చివరి పేజీలో చిరునామా వివరాలను పొందుపర్చేవారు. అయితే తాజాగా తీసుకొన్న నిర్ణయం కారణంగా ఇక చివరిపేజీలో చిరునామా వివరాలు పొందుపర్చరు. ఈ పేజీని ఖాళీగా వదిలేయనున్నారు.
. ఇక పాస్పోర్టు రంగును కూడా మార్చనున్నారు. ప్రభుత్వాధికారులు, సామాన్యులకు వేర్వేరు రంగుల్లో పాస్ పోర్టులను జారీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వాధికారులు, అధికారిక పనుల మీద విదేశాలకు వెళ్లేవారికి తెలుపు రంగు, దౌత్యవేత్తలకు ఎరుపు, మిగతా వారికి నారింజ రంగు పాస్పోర్టులు జారీ చేయనున్నారని సమాచారం.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications